వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది.
హైదరాబాద్, న్యూస్టుడే: భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. భార్గవ్తో పాటు ఆయన భార్య, మిర్యాలగూడ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ నాగలక్ష్మి, 13 మంది కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. అయితే తమతో సంప్రదింపులు జరపకుండా పార్టీలో చేర్చుకోవడంపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఆదేశాల మేరకు చేరికలను తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత చేరికల తేదీని ప్రకటిస్తామని, అప్పటివరకు భార్గవ్ చేరిక నిలుపుదలలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భార్గవ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేరికను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. వివిధ కారణాలతో పార్టీని వీడినవారు తిరిగి వస్తామంటే చేర్చుకోవాలంటూ రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసీసీ ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో భార్గవ్, పలువురు కౌన్సిలర్లు నేరుగా హైదరాబాద్కు వచ్చి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్నారు. అయితే, తమను సంప్రదించకుండా చేర్చుకోవడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో.. చేరికలను నిలుపుదల చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజమైన ఎస్సీ కాదంటూనే కడియం కుమార్తెకు కాంగ్రెస్ టికెట్: మందకృష్ణ మాదిగ
ఐదేళ్లలో ఎస్సీల సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. -
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
జగన్ ఫొటోలు ఉన్న పాసు పుస్తకాల నకళ్ల దహనానికి తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. -
జనసేనకు వంగ లక్ష్మణ్గౌడ్ రాజీనామా
జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం తాజ్కృష్ణలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్
-
గవర్నర్ వీడియోల పెన్డ్రైవ్ ఉంది.. మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
-
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
-
ఛత్తీస్గడ్లో మావోయిస్టుల కోటకు బీటలు.. దండకారణ్యంలో భద్రతా దళాల దూకుడు
-
‘ఎర్ర బంగారానికి’ యుద్ధం సెగ.. కేజీ ధర @ రూ.5 లక్షలు