Tdp-Janasena: తెదేపా-జనసేన ఉమ్మడి సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

తెదేపా-జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ‘జెండా’ సభ ప్రారంభమైంది. 

Updated : 28 Feb 2024 18:02 IST

తాడేపల్లిగూడెం: తెదేపా-జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన ‘జెండా’ సభ ప్రారంభమైంది. అడ్డంకులను దాటుకొని వివిధ ప్రాంతాల నుంచి ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణానికి 10కి.మీ మేర కార్యకర్తల వాహనాలు నిలిచిపోయాయి. వారి వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు బైకులపై సభకు చేరుకున్నారు. కూటమి తరఫున తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ ఇది. వేదికపై నాయకుల ప్రసంగాలను వీక్షించేందుకు సభాప్రాంగణంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

వేదికపై చంద్రబాబు.. పవన్‌

తాడేపల్లిగూడెం సభా వేదికపైకి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. ఇరుపార్టీల జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మరికాసేపట్లో తెదేపా, జనసేన నేతలకు, కార్యకర్తలకు.. చంద్రబాబు, పవన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సభా ప్రాంగణమంతా ‘తెలుగు జన విజయ కేతనం’ నినాదంతో మార్మోగిపోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని