Gali Janardhana Reddy: భాజపాలో చేరిన గాలి జనార్దన రెడ్డి.. పార్టీ విలీనం
Gali Janardhana Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి భాజపాలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka) మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి (Gali Janardhana Reddy) భాజపా (BJP) గూటికి చేరారు. బెంగళూరులో సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప సమక్షంలో జనార్దనరెడ్డి, ఆయన సతీమణి అరుణ లక్ష్మి కాషాయ కండువా వేసుకున్నారు. తన పార్టీని కూడా భాజపాలో విలీనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు భాజపా కార్యకర్తగా పనిచేస్తా. ఎలాంటి షరతులు లేకుండా నేను పార్టీలో చేరా. నాకు ఏ పదవులూ వద్దు’’ అని అన్నారు. గాలి జనార్దనరెడ్డి చేరికను యడియూరప్ప స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, లోక్సభ ఎన్నికల్లో గాలికి టికెట్ దక్కే అవకాశాలు లేవు. భాజపా అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి.శ్రీరాములుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
భాజపా అభ్యర్థిగా ‘సందేశ్ఖాలీ’ బాధితురాలు..
ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి జనార్దనరెడ్డి అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడ్డారని సీబీఐ అధికారులు 2011 సెప్టెంబరు 5న అరెస్టు చేశారు. బెయిల్పై బయటకు వచ్చి రాజకీయాల్లో కొనసాగినా, గతంలో మాదిరిగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. ఇప్పటికీ బళ్లారి జిల్లాలోకి అడుగు పెట్టకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అయితే, భాజపాలో ఆయన చేరికతో బళ్లారి, కొప్పళ జిల్లాల్లో పార్టీకి మరింత బలం వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్