kanakamedala: ప్రభుత్వ సహకారం లేకుండా డ్రగ్స్ కంటెయినర్ వచ్చిందా?: కనకమేడల
బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు 31.10.2022న శుభాకాంక్షలు తెలుపుతూ విజయ సాయిరెడ్డి ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.
దిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు 31.10.2022న శుభాకాంక్షలు తెలుపుతూ విజయ సాయిరెడ్డి ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారని తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. ఆయన ఎందుకు శుభాకాంక్షలు తెలిపారనేది ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. సంధ్య ఆక్వా ప్రైవేటు లిమిటెడ్ నిర్వాహకుడు కూనం వీరభద్రరావు.. వైకాపా నేత కూనం పూర్ణచంద్రరావుకు సోదరుడని తెలిపారు. పూర్ణచంద్రరావు వైకాపా కార్యకర్త అని, ఆయనకు విజయసాయిరెడ్డితో సత్సంబంధాలున్నాయని వివరించారు.
‘‘ఏ ప్రభుత్వ సహకారం లేకుండా రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను డ్రై ఈస్ట్ పేరుతో ట్రాన్స్పోర్ట్ చేయడం సాధ్యమా? కూనం వీరభద్రరావుకు అంత పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా? ఉంటే ఆ కంపెనీ ఆర్థిక రికార్డులు చెక్ చేశారా? వీటన్నింటికి వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డ్రగ్స్ ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. డ్రగ్స్ ఘటనకు తెదేపా వాళ్లు బాధ్యులని తప్పుడు ఆరోపణలు చేయడం మీ నిఘావైఫల్యం కాదా? భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, ఈ కంపెనీకి సంబంధం లేదు.. వైకాపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.
ఈ మాదక ద్రవ్యాలను లిక్కర్ కంపెనీలు తమ ఉత్పత్తుల్లో కలుపుతున్నాయని ఒక ఆరోపణ వస్తోంది. దీనిపై సీబీఐ విచారణ చేయాలి. నాసిరకం లిక్కర్తో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్య నిషేధం చేస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కనకమేడల డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం