Janasena: జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు.

Published : 26 Feb 2024 20:09 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో ఆయనకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కొత్తపల్లి చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని పవన్‌ అన్నారు. 

తెదేపాతో సుదీర్ఘ అనుభవం ఉన్న కొత్తపల్లి.. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. తెదేపా జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి కీలక పాత్ర పోషించారు. అనంతరం వైకాపాలో చేరిన కొత్తపల్లి.. ఇప్పుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని