KTR: ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం
ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,100 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
మంత్రి ఉత్తమ్ సమక్షంలో అనధికారిక ఒప్పందాలు
నాలుగు సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్
సీఎం కార్యాలయంతో పాటు దిల్లీ పెద్దల వరకూ పాత్ర
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలు
ఈనాడు- హైదరాబాద్ : ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,100 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సన్నబియ్యం టెండర్లు నాలుగు సంస్థలకే దక్కేలా నిబంధనల రూపకల్పనలోనే గోల్మాల్ చేశారన్నారు. ఒక సంస్థ కిలోకు రూ.57 కోట్ చేయగా.. మిగిలిన మూడు సంస్థలు రూ.56.90 కోట్ చేశాయని, దీన్నిబట్టే కుమ్మక్కయ్యారని అర్థమవుతోందన్నారు. ఒకవేళ ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటే.. ఇంతకంటే అద్భుతం ఇంకొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్ నుంచి దిల్లీ పెద్దల దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆదివారం భారాస నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్ తదితరులతో కలిసి కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధాన్యం అమ్మకాల్లో రూ.700-750 కోట్లు
‘‘35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి గ్లోబల్ టెండర్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి దందాకు తెరలేపింది. ఈ ఏడాది జనవరి 25న కమిటీ ఏర్పాటు చేసి, ఆ రోజునే మార్గదర్శకాలు విడుదల చేసి.. అదే రోజు టెండర్లు పిలిచింది. అవినీతి సొమ్ము కోసమే కాంగ్రెస్ పెద్దలు వేగంగా స్పందించారు. ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొంటామని స్థానిక రైస్మిల్లర్లు ముందుకొచ్చినా.. కేవలం నాలుగు సంస్థలు గ్లోబల్ టెండర్లను దక్కించుకునేలా నిబంధనలు రూపొందించారు. పనితీరు బాగోలేదనే కారణంతో భారాస ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఒక సంస్థకు కూడా కాంగ్రెస్ సర్కారు టెండర్ అప్పగించింది. క్వింటాలుకు రూ.1,885 నుంచి రూ.2,007కు కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నాయి. రూ.93 నుంచి రూ.200 తక్కువకు టెండర్లను ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ నాలుగు సంస్థలు తాము కోట్ చేసిన మొత్తానికి ధాన్యం సేకరించాలి. కానీ, క్వింటాలుకు రూ.2,230 చొప్పున తమకు చెల్లించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. 35 లక్షల టన్నులకు క్వింటాలుకు కనీసం రూ.200 చొప్పున అదనంగా రూ.700-750 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఆ సొమ్ముతో మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయి.
సన్నబియ్యం కొనుగోలులో రూ.300-350 కోట్లు
2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.300-350 కోట్ల అవినీతికి తెరలేపింది. రాష్ట్రంలో కిలో బియ్యం రూ.42కు అందుబాటులో ఉండగా.. రూ.57కు కొంటోంది. సన్నబియ్యం కొనుగోళ్లనూ గ్లోబల్ టెండర్ ద్వారా ఆ నాలుగు సంస్థలకే కట్టబెట్టింది. కిలోకు రూ.15 చొప్పున అదనంగా చెల్లిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో భాజపా పాత్ర అనుమానాస్పదంగా ఉంది. ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర అమలు, బియ్యం సేకరణ ఎఫ్సీఐ అధీనంలోనే జరుగుతాయి. రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని భాజపా శాసనసభాపక్ష నేత చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. మేము నిర్దిష్టంగా చేస్తున్న అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించాలి. రెండు టెండర్లపైనా సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈడీ, సీబీఐలకు ఎఫ్సీఐ ఫిర్యాదు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ స్పందించకుంటే న్యాయస్థానంలో కేసులు వేస్తాం. సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్