RS seat: నడ్డా స్థానం నుంచి ప్రియాంక..?
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) ఇంతవరకు పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించలేదు. తాజాగా ఆమె రాజ్యసభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) రాజ్యసభకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనుంది. దాంతో ఖాళీ కానున్న ఆ స్థానం నుంచి సోనియా గాంధీ లేక ప్రియాంకా గాంధీని ఎగువ సభకు పంపాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘దీనిపై మేం సోనియా, ప్రియాంకతో చర్చిస్తాం. వారు ఆసక్తి చూపిస్తే.. ఇద్దరిలో ఒకరు ఆ స్థానంలో రాజ్యసభకు వెళ్తారు’ అని ప్రతిభాసింగ్ వెల్లడించారు. ప్రస్తుతం సోనియా.. రాయబరేలీ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రియాంక మాత్రం ఇంతవరకు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించలేదు.
రాంచీకి చేరుకున్న సోరెన్.. సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్
2018లో హిమాచల్ ప్రదేశ్లో భాజపా అధికారంలో ఉండటంతో.. మెజార్టీ ప్రకారం ఆ రాష్ట్రం నుంచి జేపీ నడ్డా రాజ్యసభకు వెళ్లారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలతో పూర్తికానుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 68 స్థానాలకు గానూ 40 సీట్లను దక్కించుకుంది. దాంతో ఇప్పుడు ఆ స్థానం హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లనుంది. మరోపక్క, 56 ఎగువసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నామని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం.. హిమాచల్లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ప్రతిభాసింగ్ వ్యాఖ్యలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?