Malla Reddy: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మాజీ మంత్రి మల్లారెడ్డి

బెంగళూరులో కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను కలిసినట్లు మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు.

Updated : 14 Mar 2024 17:16 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి, మల్కాజిగిరి భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. ‘‘బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను కలిశా. అందులో ఎలాంటి రాజకీయం లేదు. నేను భారాసలోనే కొనసాగుతా. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను’’ అని స్పష్టం చేశారు.

అధిష్ఠానం అవకాశమిస్తే మల్కాజిరిగి లోక్‌సభ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ఇటీవల మల్లారెడ్డి చెప్పారు. కానీ, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన కుటుంబం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాలు విరమించుకుంటానని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని