BRS: మహబూబ్‌నగర్‌ భారాస ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ నేతలతో భారాస అధినేత కేసీఆర్‌ సమావేశం ముగిసింది.

Updated : 05 Mar 2024 17:57 IST

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ నేతలతో భారాస అధినేత కేసీఆర్‌ సమావేశం ముగిసింది. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించారు. నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్తున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దని నేతలు కోరారు. దీనిపై స్పందించిన అధినేత కేసీఆర్‌.. వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యులతో చర్చించి నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని