KTR: మాది గాంధీ వారసత్వం.. భాజపాది గాడ్సే వారసత్వం: కేటీఆర్‌

సూర్యాపేట జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు.

Published : 02 Oct 2023 14:54 IST

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. అనంతరం దళిత బంధు చెక్కులను అందజేసి.. సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ సహా మహిళా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ హయాంలో కరెంటు కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్‌ చేయాల్సి వచ్చేది. 3 గంటలకు మించి కాంగ్రెస్‌ పార్టీ కరెంటు ఇవ్వలేదు. భారాస హయాంలో 24 గంటలు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ పార్టీ వారంటీ పూర్తయి వందేళ్లు అయింది. వారంటీ లేని పార్టీ ఇప్పుడు గ్యారంటీలు ఇస్తుంది. కాంగ్రెస్‌ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. మాది కుటుంబ పాలన అని మోదీ విమర్శిస్తున్నారు. అవును మాది కుటుంబపాలనే.. రైతులే మా కుటుంబం. మాది గాంధీ వారసత్వం అయితే.. భాజపాది గాడ్సే వారసత్వం’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని