Nirmala Sitharaman : మీరు జయలలితను అవమానించిన విషయం మర్చిపోయినట్లున్నారు : నిర్మలా సీతారామన్
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో మాట్లాడారు. ఆమె దివంగత ముఖ్యమంత్రి జయలలితకు (Jaya lalitha) జరిగిన అవమానాన్ని గుర్తు చేశారు.
దిల్లీ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం(No Confidence Motion)పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మాట్లాడారు. మణిపుర్లో మహిళలపై జరుగుతున్న హింసను ప్రస్తావించిన డీఎంకే సభ్యులపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిండు సభలో అవమానం జరిగిన విషయాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. తొలుత డీఎంకే ఎంపీ కనిమొళి సభలో మాట్లాడుతూ దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తాం: నామా
దీనిపై స్పందించిన నిర్మలా సీతారామన్ ‘మణిపుర్, రాజస్థాన్, దిల్లీతో సహా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా దాన్ని తీవ్రంగా పరిగణించాలి. రాజకీయాలు చేయకూడదు. ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న మహిళను గతంలో డీఎంకే సభ్యులు అసెంబ్లీలోనే అవమానించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తరువాతనే మళ్లీ సభలో అడుగు పెడతానని ఆనాడు జయలలిత శపథం చేశారు. రెండేళ్ల తర్వాత ఆమె ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారని’ 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానాన్ని గుర్తు చేశారు.
దాంతో డీఎంకే ఎంపీలు నిరసనకు దిగారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి ‘మీరు కౌరవ సభ, ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు. కానీ, డీఎంకే జయలలితను మర్చిపోయిందా? నమ్మబుద్ధి కావట్లేదని’ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రాష్ట్రాలపై రుద్దుతోందని కనిమొళి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నరేంద్రమోదీ ప్రభుత్వం ‘సిలప్పదికారం’ స్ఫూర్తిని అమలు చేస్తోందని చెప్పారు. సెంగోల్ను న్యాయానికి చిహ్నంగా కొత్త పార్లమెంటులో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇన్నాళ్లూ మర్చిపోయి మ్యూజియంలో పెట్టడం తమిళులను అవమానించినట్లు కాదా అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!