Balakrishna: తెలుగు సినీ పరిశ్రమను వైకాపా నేతలు కించపరిచారు: బాలకృష్ణ
అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు.
అమరావతి: అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు. సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమని అధికార పార్టీ నేతలు కించపరిచారని ఆరోపించారు. శాసనసభలో సస్పెండ్ అనంతరం మల్కాపురం గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.
స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారు!
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైకాపా ఎమ్మెల్యేలేనన్న ఆయన.. తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు. స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. మంద బలంతో విర్రవీగుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదన్నారు. ప్రజలే వారికి త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు?: అచ్చెన్న
చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకొని.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే నినాదంతో అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీకి ఒక దుర్దినమన్న అచ్చెన్న.. 200 మంది మార్షల్స్ను పెట్టి సభ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రి నేరుగా మీసం మెలేసి బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు.
జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్ కారణం?
ములాఖాత్, మిలాఖాత్లతోనే పుట్టిన పార్టీ వైకాపా అని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. దిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖాత్, మిలాఖాత్ అవుతున్నారని ప్రశ్నించారు. దశాబ్ద కాలంగా జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్, మిలాఖాత్ కారణమని నిలదీశారు. స్కిల్ కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. 144 సెక్షన్, 30ఏ చట్టాలను అసెంబ్లీలోనూ సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెదేపా శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు తెలియాలంటే.. తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతో పవన్ భేటీ
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. -
పోలిపల్లిలో యువగళం ముగింపు సభ!
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ఈ నెల 17న నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. -
దోచుకోవడంపై ఉన్నశ్రద్ధ.. రైతుల్ని ఆదుకోవడంలో లేదా?
నదీగర్భాల్ని తొలిచి మరీ ఇసుక దోచుకోవడంపై సీఎం జగన్ చూపిస్తున్న శ్రద్ధలో కొంచెమైనా తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతుల్ని, సర్వస్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవడంలో లేదని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. -
రూ.1,233 కోట్ల కేటాయింపులు ఎవరికి దోచిపెట్టడానికి?
‘తిరుమల నడకమార్గంలో చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించలేరు.. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం పెట్టలేరు కానీ.. భూమన కరుణాకర్రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్ అయిన మూడు నెలల్లో బడ్జెట్లో చూపకుండా వివిధ కాంట్రాక్టుల కింద రూ.1,233 కోట్లు కేటాయిస్తారా? -
మంచినీళ్లు కూడా ఇవ్వరా?
మిగ్జాం తుపానును ఎదుర్కోవడం, బాధితుల్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. -
రైతాంగాన్ని ఆదుకోవాలి
తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. -
సీఎం బయటికి రారేం?
మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సీఎం జగన్ ఒక చిన్న సందేశమిచ్చి ఇంట్లో కూర్చోవడం చూస్తే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
ఏపీ అప్పు రూ.11.28 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు దొరకకుండా ఉండటానికి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేస్తోందని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.11.28 లక్షల కోట్లకు చేరాయని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పేర్కొన్నారు. -
అంచనాలకు మించి తుపాను నష్టం
తుపాను నష్టం అంచనాలకు మించి ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. -
రేవంత్ అంచెలంచెలుగా ఎదిగారు
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.