Balakrishna: తెలుగు సినీ పరిశ్రమను వైకాపా నేతలు కించపరిచారు: బాలకృష్ణ
అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు.
అమరావతి: అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైకాపా ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు. సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమని అధికార పార్టీ నేతలు కించపరిచారని ఆరోపించారు. శాసనసభలో సస్పెండ్ అనంతరం మల్కాపురం గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.
స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారు!
తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైకాపా ఎమ్మెల్యేలేనన్న ఆయన.. తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు. స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. మంద బలంతో విర్రవీగుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదన్నారు. ప్రజలే వారికి త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు?: అచ్చెన్న
చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకొని.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే నినాదంతో అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీకి ఒక దుర్దినమన్న అచ్చెన్న.. 200 మంది మార్షల్స్ను పెట్టి సభ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రి నేరుగా మీసం మెలేసి బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు.
జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్ కారణం?
ములాఖాత్, మిలాఖాత్లతోనే పుట్టిన పార్టీ వైకాపా అని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. దిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖాత్, మిలాఖాత్ అవుతున్నారని ప్రశ్నించారు. దశాబ్ద కాలంగా జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్, మిలాఖాత్ కారణమని నిలదీశారు. స్కిల్ కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. 144 సెక్షన్, 30ఏ చట్టాలను అసెంబ్లీలోనూ సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెదేపా శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు తెలియాలంటే.. తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్తో జగన్ దోస్తీ ఆస్తులు కాపాడుకోవడానికేనా?
తెలంగాణలో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికే సీఎం జగన్ కేసీఆర్తో దోస్తీ చేస్తున్నారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. -
తెదేపాతో పొత్తుపై నోరు జారితే సహించను
‘జనసేన తెదేపా పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా, చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటివారిని వైకాపా కోవర్టులుగా భావిస్తాం. గట్టి చర్యలు తీసుకుంటాం. -
ప్రజల్లోకి ఎప్పుడు, ఎలా వస్తానో త్వరలో చెబుతా
-
కోడికత్తిలా నాగార్జునసాగర్ డ్రామా
ఎప్పుడూ లేని కరవు రాష్ట్రాన్ని వెంటాడుతోందని, రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి ప్యాలెస్లో హాయిగా ఉన్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. -
పదేళ్లలో 50% మహిళా సీఎంలే
కాంగ్రెస్ సంస్థాగత పదవుల్లో మహిళల పాత్రను గణనీయంగా పెంచేందుకు క్రియాశీలంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
కొప్పుల ఈశ్వర్పై ఎన్నికల పిటిషన్ కొట్టివేత
జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
స్వప్రయోజనాలకే కృష్ణా జలాల తాకట్టు
తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాబాయ్ హత్య కేసు నుంచి అవినాష్రెడ్డిని కాపాడటానికి.. కృష్ణా జలాల్ని పక్క రాష్ట్రానికి సీఎం జగన్ ధారాదత్తం చేశారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
బినామీలకు ఎసైన్డ్ భూములు కట్టబెట్టే కుట్ర
గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల ఎసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదుచేయించి, ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు భారాస నేతలు కసరత్తు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. -
‘యువగళం’.. వైకాపా పతనానికి నాంది
తెదేపా అధినేత చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవలంబించిన వైఖరే ఆ రాష్ట్రంలో భారాస పార్టీ గడ్డు పరిస్థితికి కారణమని జై భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జి.చిన్నయ్య దొర విమర్శించారు. -
జల వివాదం కేసీఆర్, జగన్ల ఎత్తుగడ: కోదండరాం
ప్రభుత్వ నిరంకుశ పాలనపై ఓటు హక్కు ద్వారా ప్రజలు తిరుగుబాటు చేశారని, ఆ మేరకు ఎన్నికల ఫలితాలు రానున్నాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
రాష్ట్రంలో జగన్ పీనల్ కోడ్
రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో జగన్ పీనల్ కోడ్ అమలవుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
10 నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు!
తెదేపా అధినేత చంద్రబాబు త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.