Nara Lokesh: సీఎం నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలేవీ?: లోకేశ్

తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే గంజాయి లేకుండా చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.

Updated : 24 Mar 2024 13:12 IST

అమరావతి: తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీఎం జగన్‌ నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని విమర్శించారు. ఆయన ఇంటి సమీపంలో తాగునీటి సమస్య ఉన్నా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీ అపార్టుమెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్నారు. బోధనా పద్ధతుల్లో కేజీ నుంచి పీజీ వరకు సమూల మార్పులు చేస్తామని చెప్పారు.

‘‘ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే శాంతి భద్రతలు అదుపులో లేవు. గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. రాష్ట్రంలోని యువతకు మంచి ఉద్యోగాలు రావాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు చేయాలి. ఐరోపా దేశాల్లో ఉచితంగా చదువు, వైద్యం అందిస్తున్నారు. అదే పద్ధతిని మన రాష్ట్రంలోనూ ప్రవేశపెడతాం. ప్రజలు కట్టిన పన్నులకు వారు పొందుతున్న వసతులకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. దీన్ని తగ్గించాల్సిన అవసరముంది.’’ అని  లోకేశ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని