Karnataka: కన్నడనాట మిశ్రమ ఫలితం
కర్ణాటకలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, జేడీఎస్లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. మొత్తంగా భాజపా పైచేయి సాధించినా.. గతం కంటే సీట్లు తగ్గాయి.
ఎన్డీయేదే పైచేయి అయినా తగ్గిన సీట్లు
కాస్త మెరుగుపడిన కాంగ్రెస్
హెచ్.డి.కుమారస్వామి
ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, జేడీఎస్లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. మొత్తంగా భాజపా పైచేయి సాధించినా.. గతం కంటే సీట్లు తగ్గాయి. మరోవైపు అసెంబ్లీ స్థాయి ఫలితాలను కాంగ్రెస్ సాధించలేకపోయింది. అయితే గతం కంటే కాస్త మెరుగుపడింది. రాష్ట్రంలోని 28 స్థానాల్లో 17 చోట్ల భాజపా గెలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే 8 స్థానాలను కోల్పోయింది. ఇక అధికారంలో ఉండీ రెండంకెల స్థానాలు గెలుచుకోలేని కాంగ్రెస్ నిరాశకు గురైంది. 2019లో కేవలం ఒక స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ఈసారి 9 స్థానాలను గెలుచుకుంది. భాజపాతో కలిసి పోటీ చేసిన జేడీఎస్ మూడింట పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకున్నా తమకు కంచుకోటగా ఉన్న హాసనను కోల్పోయి అసంతృప్తిని మిగుల్చుకుంది.
లక్ష్యం చేర్చని ప్రచారాస్త్రం
అధికార పక్షం కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రం 5 గ్యారంటీ పథకాలే. వీటి ద్వారా కనీసం 20 స్థానాలైనా సాధిస్తామని కాంగ్రెస్ అంచనా వేసింది. కనీస పక్షంగా రెండంకెల స్థానాలైనా గెలుస్తామన్న ధీమాతో అడుగు ముందుకేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేర్చేందుకు గ్యారంటీలు ఉపకరించలేదని ఫలితాలు తేల్చాయి. ఎగ్జిట్ పోల్లో.. దాదాపు అన్ని సంస్థలు.. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తుందన్న అంచనాలను ఈ ఫలితాలు తల్లకిందులు చేశాయి. బెంగళూరు పరిధిలోని 4 స్థానాలను కోల్పోవటం, అందులో 2019లో గెలిచిన ఏకైక స్థానం బెంగళూరు గ్రామీణలో ఓడిపోవటం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఈ స్థానంలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఓడిపోయారు.
మేలు చేసిన మైత్రి
జేడీఎస్తో మైత్రి భాజపాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ఒక్కలిగ ప్రాబల్యం ఉన్న 7 స్థానాల్లో నాలుగింటిని భాజపా గెలుచుకోగా మిగిలిన 3 స్థానాల్లో మిత్రపక్షం జేడీఎస్ రెండు స్థానాలను సాధించింది. మరోవైపు భాజపాతో కలిసి పోటీ చేసిన జేడీఎస్కు ఈ ఎన్నికలు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి 5 స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఈసారి భాజపాతో కలిసి పోటీ చేసిన 3 స్థానాల్లో రెండింటిని సొంతం చేసుకోవటం విశేషం.
ప్రజ్వల్ ఓటమి
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలతో ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) కస్టడీలో ఉన్న హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఈ ఫలితాలు మరింత కుంగదీశాయి. గత 25 ఏళ్లుగా జేడీఎస్కు కంచుకోటగా ఉంటూ.. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు రాజకీయ కేంద్రంగా మారిన హాసన ఈసారి కాంగ్రెస్ వశమైంది. ఏప్రిల్ 26న ఎన్నికలకు ముందు రోజు హాసనకు సంబంధించిన అశ్లీల వీడియో పెన్డ్రైవ్లు కలకలం సృష్టించాయి. ఈ ఆరోపణలే ప్రజ్వల్ ఓటమిని శాసించాయి. ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజ్వల్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎం.శ్రేయస్ పటేల్ చేతిలో 43,739 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి