JDS: భాజపా నేతలతో దేవెగౌడ కీలక భేటీ.. ఎన్డీయేలో జేడీఎస్ చేరికకు రంగం సిద్ధం?
సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా భాజపా, జేడీఎస్ ఒక్కటి కాబోతున్నాయి. పొత్తులు, సీట్ల కేటాయింపు అంశంపై చర్చించేందుకు జేడీఎస్ అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామి భాజపా అగ్రనాయకత్వంతో భేటీ అయ్యారు.