కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
Congress: కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చాయని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు కూటమి విజయంగా అభివర్ణించారు.
మంబయి: కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు (అచ్చేదిన్) వచ్చాయని శివసేన (యూబీటీ), ఇండియా కూటమి నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈ విషయం చెప్పడానికి ఏ ఎగ్జిట్ పోల్ అవసరం లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ గురువారంతో ముగిసింది. అనంతరం వెలువడిన పలు సర్వే అంచనాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్లో పరిస్థితి కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండనుందని అంచనా వేశాయి. మిజోరంలో ప్రాంతీయ పార్టీల మధ్యే పోరు ఉండనుందని తెలిపాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలడిన నేపథ్యంలో సంజయ్ రౌత్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ గెలుపు అంటే అది ఇండియా కూటమి విజయం. నేను దాన్ని బలంగా నమ్ముతా. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందితే విపక్షాల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దీనిని కూటమి విజయంగా చూడాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే నాయకత్వమే దీనంతటికీ కారణం’’ అని సంజయ్ రౌత్ అన్నారు.
కేసీఆర్ను గెలిపించడం కోసం జగన్ కుట్ర: సీపీఐ నారాయణ
మరోవైపు ప్రియాంక భర్త, వ్యాపారవేత్త రాబర్ట్వాద్రా సైతం ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై స్పందించారు. మధ్యప్రదేశ్లో మరోసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాను మరీ అంతగా విశ్వసించనని.. వాస్తవ ఫలితాలనే నమ్ముతానని చెప్పారు. గడిచిన కొన్ని నెలల్లో చాలా మందిని తాను వ్యక్తిగతంగా కలిశానని, అందరూ మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని (కమల్నాథ్ సర్కారును) కూలదోసిన భాజపా పట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారని రాబర్ట్ వాద్రా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. -
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరారు. -
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
ప్రధాని నరేంద్ర మోదీపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. -
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. -
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అస్వస్థతకు గురయ్యారు. -
ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ చేపట్టిన తర్వాత బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య బుధవారం లేఖ రాశారు. -
సీఎం సొంతూరు ఉన్న నియోజకవర్గంలో భారాస నేతలపై దాడులు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, సీఎం రేవంత్రెడ్డి సొంతూరు ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో భారాస నేతలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. -
వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపై అభాండాలా?
కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా.. ప్రతిపక్షాలు, విద్యుత్తు ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. -
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం
దొడ్డు వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వకపోవడం రైతులకు తీవ్ర అన్యాయం చేయడమేనని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
మాలీవాల్పై దాడి.. విచారణ జరిపించాలి
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడిపై భాజపా ఆందోలన వ్యక్తం చేసింది. ఈ దాడిపై సమగ్ర విచారణ జరపాలంటూ భాజపా నాయకులు, మహిళా మోర్చా సభ్యులు బుధవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐడీఎఫ్ పొరపాటు.. సొంత సైనికులను కోల్పోయిన ఇజ్రాయెల్
-
నగరంలో భారీ వర్షం.. కుంగిన నాలాలు.. జలమయమైన రోడ్లు
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!