Sachin Pilot: గహ్లోత్ విభేదాలకు చెక్..! సచిన్ పైలట్ కీలక ప్రకటన
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్తో విభేదాలకు ముగింపు పలుకుతున్నట్లు సచిన్ పైలట్ తెలిపారు. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య అధికార పోరు సాగుతోన్న విషయం తెలిసిందే.
జైపుర్: రాజస్థాన్ (Rajasthan)లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట గుర్తుకొచ్చేది సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot)ల మధ్య విభేదాలే! త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ వ్యవహారం అధిష్ఠానానికీ తలనొప్పిగా మారింది. ఈ తరుణంలోనే సచిన్ పైలట్ కీలక ప్రకటన చేశారు. గహ్లోత్తో సాగుతోన్న వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ (Congress) అధినాయకత్వం సమావేశం నిర్వహించిన రెండు రోజుల్లోనే పైలట్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సలహా మేరకు నడచుకుంటున్నానని.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు సమష్టి నాయకత్వమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. పార్టీలో పూర్తి ఐక్యత ఉంటేనే.. ఎన్నికల్లో విజయం సాధించగలమని కాంగ్రెస్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
‘గతంలో జరిగిన విషయాలను క్షమించి, మరచిపోవాలని.. వాటిని వదిలేసి ముందుకు సాగాలని ఖర్గే ఇటీవల సలహా ఇచ్చారు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని నమ్ముతున్నా’ అని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పైలట్ తెలిపారు. ‘గహ్లోత్ నాకన్నా పెద్దవారు. ఆయనకు అనుభవం ఎక్కువ. ఆయన భుజాలపై పెద్ద బాధ్యతలున్నాయి. నేను రాజస్థాన్ పీసీసీ చీఫ్ ఉన్న సమయంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నించాను. ప్రస్తుతం గహ్లోత్ అదే చేసేందుకు యత్నిస్తున్నారు. చిన్నచిన్న విభేదాలుంటే అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వ్యక్తికన్నా.. పార్టీ, ప్రజలే ముఖ్యం. ఇద్దరం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం’ అని అన్నారు. ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే మా తదుపరి లక్ష్యం. వ్యక్తులు, వారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యం కాదు. అది ముగిసిన అధ్యాయం’ అని వ్యాఖ్యానించారు.
‘ఏ నిర్ణయమైన శిరోధార్యం.. అయితే..!’
‘ఇప్పుడు మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ.. కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ దేశానికి కాంగ్రెస్ చాలా అవసరం. మాకు రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కావాలి. ఇది పొందాలంటే.. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలకు ఆమోదయోగ్యమైన విధంగా ఐక్యతతో ముందుకెళ్లాల్సి ఉంటుంది’ అని పైలట్ అన్నారు. పార్టీలో ఎటువంటి పాత్ర పోషించనున్నారని ప్రశ్నించగా.. గతంలో తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించానని, పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయమైనా తనకు శిరోధార్యమని చెప్పారు. అయితే, రాజస్థాన్తో తనకు ఎనలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్లో అధికారంలో ఉన్న పార్టీని తదుపరి ఎన్నికల్లో ఓడించే సంప్రదాయాన్ని తిరగరాసి, మరిన్ని సీట్లతో గెలుపొందుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్లో 2018లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి గహ్లోత్, పైలట్ల మధ్య అధికార పోరు సాగుతోంది. 2020లో సీఎం గహ్లోత్పై అసమ్మతి స్వరం వినిపిస్తూ అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దాదాపు నెలరోజులపాటు ఈ రాజకీయ ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన ప్రకటించారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళా.. రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. మరోవైపు గహ్లోత్పై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్న పైలట్.. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టారు. గత భాజపా ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ పరిణామాలు పార్టీని కలవరపెట్టినప్పటికీ.. తాజా నిర్ణయంతో ఊరట లభించినట్లయ్యింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం