AP Cabinet: మంత్రులెవరు.. ఏపీ క్యాబినెట్ కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, భాజపా భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపా నుంచి ఎవరెవర్ని ఎంచుకుంటారు.. అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మంత్రివర్గంలో లోకేశ్, పవన్ చేరతారా అనేదానిపై చర్చ
తెదేపాలో ‘క్లీన్’ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, బీసీ, యువత, మహిళలకు ప్రాధాన్యమిచ్చే యోచన
జనసేన, భాజపాల నుంచి ఎవరి ఎంపికనేదీ కీలకమే
తెదేపా అవకాశాల్ని ప్రభావితం చేయనున్న మిత్రపక్షాల కూర్పు
12న ప్రమాణస్వీకారం!
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన, భాజపా భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు? తెదేపా నుంచి ఎవరెవర్ని ఎంచుకుంటారు.. అన్న అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెదేపా అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా? పార్టీపరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైనా చర్చ సాగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకూ పోకుండా ‘క్లీన్’ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశముందని అంచనా. కొంతకాలంగా పార్టీలో యువతకు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా.. కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యపడటం లేదు. తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీనవర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలోకన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశమిచ్చారు. రాయలసీమలో కడప (మాధవీరెడ్డి), పుట్టపర్తి (సింధూరరెడ్డి), పెనుకొండ (సవిత) లాంటి చోట్ల మొదటిసారి మహిళలు పోటీ చేసి గెలుపొందారు. ఎస్సీల నుంచి బండారు శ్రావణిశ్రీ (శింగనమల), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), ఎస్టీల నుంచి శిరీషాదేవి (రంపచోడవరం), జగదీశ్వరి (కురుపాం) విజయం సాధించారు. బీసీల నుంచి గళ్లా మాధవి (గుంటూరు పశ్చిమ), యనమల దివ్య (తుని), సవిత (పెనుగొండ) వంటి వారున్నారు. వీరిలో ఒకరిద్దరికి అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది.
వీరంతా యువతరానికి, రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రతినిధులే. ఒకప్పుడు ఫ్యాక్షన్కు పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు. యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశమివ్వాలనుకుంటే.. ఎస్సీ వర్గానికి చెందిన తంగిరాల సౌమ్య (నందిగామ), వంగలపూడి అనిత (పాయకరావుపేట) వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు. పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోకగజపతిరాజు కుమార్తె, విజయనగరం నుంచి గెలుపొందిన అదితి గజపతిరాజు పేరూ పరిశీలనలోకి రావచ్చు.
సీనియర్లలో ఎవరికి చోటు?
తెదేపాలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, విజయనగరం నుంచి కోండ్రు మురళీమోహన్, ఆర్.వి.ఎస్.కె.రంగారావు, కళా వెంకటరావు, విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, శ్రీరాం తాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేశ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించొచ్చు.
ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, బి.ఎన్.విజయ్కుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్రెడ్డితోపాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశముంది. అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పుచేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో తెదేపా చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశమొస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ఛాన్సు దక్కొచ్చు.
మైనారిటీల నుంచి..
మైనారిటీల నుంచి ఎన్ఎండీ ఫరూక్ (నంద్యాల), నసీర్ (గుంటూరు తూర్పు), షాజహాన్ బాషా (మదనపల్లి) ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లోనూ ఎన్డీయే అభ్యర్థులు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు.
పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా?
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరతారా? తన పార్టీ శాసనసభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీపరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశముంది. జనసేన తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్ఠంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలినవాటికి కాపు, బీసీ, ఎస్సీ/ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో భాజపా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశమిచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా.. గరిష్ఠంగా ఇద్దరికే చోటు లభించొచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, భాజపాల నుంచి ఏ జిల్లాలో, ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్నిబట్టి తెదేపా ఎమ్మెల్యేల అవకాశాలూ ప్రభావితమవుతాయి.
మోదీ ప్రమాణస్వీకారం తర్వాతే..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెదేపా వర్గాల సమాచారం. ఎన్డీయే పక్షాల తరఫున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణస్వీకారం చేయొచ్చని, దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీయేలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాల కథనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. -
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు సహా ఆ పార్టీ సానుభూతిపరులపై ఎక్కడా ఉద్దేశపూర్వకంగా దాడులు జరగట్లేదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
జులై 27న దిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి దూరంగా ఉంటామంటూ విపక్షాల కూటమి (INDIA)కి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు. -
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. -
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై అభూతకల్పన కల్పిస్తున్నారని మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ అన్నారు. -
వైకాపా హయాంలో రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారు: ఏపీ సీఎం చంద్రబాబు
2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
తెలంగాణలో కరవు అనే మాట వినపడకూడదని కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ వేడుకలు
-
ఐడెంటిటీ మార్చుకోవాల్సి వస్తే: విజయ్ ఆంటోనీ సమాధానమేంటంటే?
-
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
-
డేటింగ్ యాప్లతో విశాఖలో విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ