TDP: 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్‌ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..

పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది.

Updated : 29 Mar 2024 20:01 IST

అమరావతి: అభ్యర్థుల తుది జాబితాను తెదేపా (TDP) ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించినా.. చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు. కదిరి స్థానంలో అభ్యర్థిని తెదేపా మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా.. ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చింది.

సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు భాజపాకు కేటాయించారు. దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్‌సభకు కలిశెట్టి అప్పలనాయుడును ఆ పార్టీ బరిలో నిలిపింది.

అసెంబ్లీ అభ్యర్థులు

  • చీపురుపల్లి- కళా వెంకట్రావు
  • భీమిలి- గంటా శ్రీనివాసరావు
  • పాడేరు- కె. వెంకటరమేశ్‌ నాయుడు
  • దర్శి- గొట్టిపాటి లక్ష్మి
  • రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం
  • ఆలూరు- వీరభద్ర గౌడ్‌
  • గుంతకల్లు- గుమ్మనూరు జయరామ్
  • అనంతపురం అర్బన్‌- దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌
  • కదిరి- కందికుంట వెంకట ప్రసాద్‌

పార్లమెంట్ అభ్యర్థులు

  • విజయనగరం- కలిశెట్టి అప్పలనాయుడు
  • ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి
  • అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ
  • కడప- భూపేష్‌రెడ్డి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని