Kishan Reddy: ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదంతో ఎన్నికలకు: కిషన్‌రెడ్డి

సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

Published : 08 Jan 2024 18:50 IST

హైదరాబాద్‌: సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌, భాజపా మధ్యే ప్రధానంగా పోటీ ఉందన్నారు. భారాస.. కేసీఆర్‌ అవసరం తెలంగాణకు లేదన్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదంతో ముందుకు సాగుతామని చెప్పారు. నూతన యువ ఓటర్లతో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని