TDP: తెదేపాలో చేరిన 40 మంది వాలంటీర్లు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు నుంచి 40 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు.

Updated : 12 Apr 2024 19:29 IST

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు నుంచి 40 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తుందని, రూ.10 వేలు జీతం వస్తుందన్న భరోసాతోనే వారంతా పార్టీలో చేరారని పేర్కొన్నారు. తెదేపాపై నమ్మకంతో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే.. మహిళా వాలంటీర్లకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక మహిళను ఓడించలేక వైకాపా నేతలు అనవసర విమర్శలకు దిగుతున్నారని, ఓట్లు అడిగే ముందు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని