Uttam Kumar Reddy: కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమే: మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: భారాస ప్రభుత్వ హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనని చెప్పారు. భారాస ప్రభుత్వం రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. విద్యుత్ విషయంలో ఆ పార్టీ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధమన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. పార్టీ, ప్రభుత్వంలో తనకు పరిమిత అధికారమే ఉందన్నారు.
‘‘కేసీఆర్ ఆదివారం పచ్చి అబద్ధాలు మాట్లాడారు. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పార్టీ మిగలదు అనే భయం ఆయనలో మొదలైంది. జాతీయ పార్టీ అన్నారు.. ఇంత త్వరగా ఏ పార్టీ కుప్పకూలలేదు. లోక్సభ ఎన్నికల తర్వాత భారాస మిగలదు. కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప అందులో ఎవరూ ఉండరు.
భారాస అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారు. కేసీఆర్ హయాంలో నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం ఇవ్వలేదు. నీటిపారుదల రంగం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు ఉందా? కమీషన్ల కోసం ప్లాన్, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరంపై మాట్లాడేందుకు ఆయన సిగ్గుపడాలి. భారాస ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు.. వారి హయాంలోనే కూలిపోయింది. ఒక్క పిల్లరే కుంగిందని.. అమెరికాలో బ్యారేజీ కుంగలేదా? అని కేసీఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతోంది. ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఆయనే అంగీకరించారు. మాజీ సీఎం అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలి. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4వేల మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేది. 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ఖర్చు గురించి ఆలోచించడం లేదు. ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం’’ అని ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ