Uttamkumar reddy: పాలమూరు-రంగారెడ్డి మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Politics News Team Published : 25 Sep 2024 13:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

జడ్చర్ల: తమకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు ‘పాలమూరు-రంగారెడ్డి’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పర్యటించారు. కిష్టారంలోని ఉదండాపూర్‌ జలాశయం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను కూడా భారాస ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తామన్నారు. ఉదండాపూర్‌ నిర్వాసితులకు రూ.45 కోట్లు విడుదల చేశామన్నారు. అనంతరం గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మంత్రులు  పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని