TDP: ఓడిపోయేందుకే వైఎస్ జగన్ ‘సిద్ధం’: చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైకాపా కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తెదేపాలో చేరారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో వారిద్దరూ పసుపు కండువా కప్పుకొన్నారు. ఇటీవల వైకాపాకు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్రెడ్డితో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు తెదేపాలో చేరారు. నెల్లూరు పీవీఆర్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీగా తెదేపా-జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.
‘‘వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు. ఆయన.. ప్రజా సేవకు మారుపేరు. యుద్ధానికి సై అంటూ అంతా ముందుకొస్తున్నారు. వేమిరెడ్డి రాకతో సునాయాసంగా గెలవబోతున్నాం. ప్రజలకు సేవ చేసే ఏకైక ఉద్దేశంతోనే వేమిరెడ్డి పార్టీలోకి వచ్చారు. నెల్లూరు కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయింది. పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి స్వాగతిస్తున్నా.
ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారు. మనమంతా బానిసలం.. ఆయన రారాజు.. అనుకుంటున్నారు. ఎవరైనా ఆయన్ను వ్యతిరేకించినా.. చేసింది తప్పని చెప్పినా.. ఇక వారి పని అయిపోయినట్లే. అలా ప్రశ్నించినందుకే సొంత పార్టీ నేతలకు సైతం వేధింపులు తప్పలేదు. సీఎం జగన్ అవలంబిస్తోన్న తీరును చూస్తే చాలా బాధేస్తోంది. వ్యక్తులు, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పార్టీ తెదేపా. అహంకారంతో ఇష్టానుసారం రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. ఆ బాధ్యత మన అందరిపైనా ఉంది. ఇది ఏ ఒక్కరి కోసమో కాదు. ఐదు కోట్ల ప్రజానీకం, భావితరాల భవిష్యత్తు కోసం జగన్ను గద్దె దించాలి. రాష్ట్రం, ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండేందుకే ఏమాత్రం అర్హత లేదు. ఆయన విధానాలు నచ్చక వాళ్ల నేతలే పార్టీకి బైబై అంటున్నారు. కార్యకర్తలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ముఖ్యమంత్రికి భంగపాటు తప్పదు. వెయ్యి శాతం చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయేది తెదేపా-జనసేన ప్రభుత్వమే.
విశాఖలో దోచేసిన వ్యక్తి నెల్లూరుకు..
ఇది ప్రారంభం మాత్రమే. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే ఉద్ధృతమైన తిరుగుబాటు మొదలవుతుంది. వైకాపా నాయకులు రోడ్డుమీద తిరగాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు విశాఖను దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. అక్కడ మొత్తం ఊడ్చేశారు.. ఇప్పుడు నెల్లూరుకు వస్తే ఇక్కడా ఏమీ మిగలదు. తనకు ఎవరూ ఎదురు ఉండొద్దనే నియంతృత్వ ధోరణిలో జగన్ ముందుకెళ్తున్నారు. దోచుకున్న డబ్బుతో ఎక్కడ పడితే అక్కడ సిద్ధం.. సిద్ధం.. అని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. మొదట్లో సిద్ధం అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత ఆలోచిస్తే... ఓడిపోయేందుకే జగన్ ‘సిద్ధం’ అని అంటున్నట్లు అర్థమైంది.
జగన్.. హూ కిల్డ్ బాబాయ్ అని నీ సోదరి అడుగుతోంది..
హూ కిల్డ్ బాబాయ్.. అని నీ సోదరి అడుగుతోంది జగన్.. సమాధానం చెప్పండి. వివేకా హత్య కేసును ఎందుకు తేల్చలేదని సునీత ప్రశ్నించారు. బాబాయ్ హత్యపై సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసురుతున్నా. ధైర్యంగా మాట్లాడితే ఆమెపైనా కేసులు పెట్టి వేధిస్తారా? నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎలాంటి నీచానికైనా దిగజారుతారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వైకాపాకు నిద్ర పట్టడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పోరాడాలనుకుంటే వాళ్లకు బాధేంటో?కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకునే రకం వాళ్లు. అలా చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి అందరినీ వేధించారు. తెదేపాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. రాజకీయ రౌడీలను నిమిషంలోపే అణచివేసే శక్తి తెదేపాకు ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్