Chennai: మోటార్ సైకిల్ రేసింగ్లో విషాదం.. ప్రమాదానికి గురై 13 ఏళ్ల రేసర్ మృతి
చెన్నైలో శనివారం జరిగిన మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల శ్రేయాస్ అనే యువరైడర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.
చెన్నై: చెన్నైలో శనివారం జరిగిన జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల కొప్పరం శ్రేయస్ హరీష్ అనే యువ రేసర్ సర్క్యూట్లో జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. దీంతో మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగున్న ఈ పోటీలను శని, ఆదివారాలు నిలిపివేస్తున్నట్లు ఈవెంట్ ప్రమోటర్ తెలిపారు. బెంగళూరుకు చెందిన శ్రేయస్కు బైక్ రేసింగ్లు అంటే విపరీతమైన ఇష్టం. దీంతో రేసింగ్లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పలు రేసింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో పెట్రోనాస్ టీవీఎస్ ఛాంపియన్షిప్లో నాలుగు రేసుల్లో గెలిచి రైజింగ్ స్టార్గా ఎదిగాడు.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా!?
మద్రాస్ అంతర్జాతీయ సర్య్కూట్లో ‘ జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్’ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం పోల్ పొజిషన్కు అర్హత సాధించిన హరీశ్ రూకీ రేసులో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మూడో రౌండ్లో అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. నిర్వాహకులు వెంటనే రేస్ను ఆపేసి శ్రేయస్ను సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో పలువురు శ్రేయస్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ ప్రతిభావంతుడైన ఒక యువ రైడర్ను కోల్పోయాం. గత కొంత కాలంగా అత్యద్భుత రేసింగ్ ప్రతిభతో శ్రేయస్ రాణిస్తున్నాడు’’ అని ఎంఎంఎస్సీ ప్రెసిడెంట్ అజిత్ థామస్ ఒక ప్రకటనలో తెలిపారు.
‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారంలో జరగాల్సిన మిగిలిన రేసింగ్లను నిలిపివేయాలని నిర్ణయించాం. శ్రేయస్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో అతడి కుటుంబం చుట్టూనే మా ఆలోచనలు తిరుగుతున్నాయి’’ అని ఈరేసింగ్లో పాలుపంచుకున్న ఎంఎంఎస్సీ తెలిపింది. ఈ ఏడాది మేలో జరిగిన మినీజీపీ ఇండియా టైటిల్ పోరులో శ్రేయాస్ విజయం సాధించాడు. అంతేకాకుండా స్పెయిన్లో జరిగిన మినీజీపీ పోటీల్లో పాల్గొని వరుసగా 5, 4 స్థానాల్లో నిలిచాడు. ‘సీఆర్ఏ మోటార్స్పోర్ట్స్’ తరపున 250 సీసీ కేటగిరీలో ఈ నెలలో మలేసియాలో జరగనున్న ఎంఎస్బీకే ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు శ్రేయస్ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇలాంటి సంఘటనే ఈ ఏడాదిలో మరోటి చోటుచేసుకొని ప్రముఖ రేసర్ చనిపోయాడు. మద్రాస్లోని ఇంటర్నేషనల్ సర్య్కూట్లో జరిగిన ఎంఆర్ఎఫ్ ఎంఎంఎస్సీ ఎఫ్ఎంఎస్సీఐ ఇండియన్ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ 2022లో 59 ఏళ్ల కేసీ కుమార్ ప్రమదానికి గురై ఈ ఏడాది జనవరిలో చనిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం. -
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ