Ranji Trophy: టీమ్ఇండియాలో నో ఛాన్స్.. ఒకే ఇన్నింగ్స్లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్
చాలా కాలంగా టీమ్ఇండియాకు దూరంగా ఉన్న భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు టీమ్ఇండియాలో భువనేశ్వర్ కుమార్ ప్రధాన బౌలర్గా కొనసాగాడు. ఈ 33 ఏళ్ల ఫాస్ట్బౌలర్ కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి భారత జట్టులో చోటు కోల్పోయాడు. అతడు చివరి టెస్టు ఆడి ఐదేళ్లు దాటింది. 2022 జనవరిలో ఆఖరి వన్డే, అదే ఏడాది నవంబర్లో టీ20 ఆడాడు. తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే కసితో ఉన్న భువీ ఆరేళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీలో ఉత్తర్ప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్ తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. 22 ఓవర్లు బౌలింగ్ చేసి 41 పరుగులిచ్చి ఏకంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు మెయిడిన్లు ఉండటం విశేషం.
ఎలైట్ గ్రూప్ బిలో బెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో తొలి రోజు (శనివారం) ఐదు వికెట్లు తీసిన భువీ.. రెండో రోజు మరో ముగ్గురిని ఔట్ చేసి తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ షమి సోదరుడు మహ్మద్ కైఫ్ (45) రాణించాడు. మొదటి రోజు ఆటలో మహ్మద్ కైఫ్ (4/14), సూరజ్ సింధు జైస్వాల్ (3/20), ఇషాన్ పొరెల్ (2/24) బంతితో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్లో ఉత్తర్ప్రదేశ్ 60 రన్స్కే కుప్పకూలింది.
భువీకి దక్కని చోటు..
భారత్, ఇంగ్లాండ్ మధ్య జనవరి 25 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల కోసం శుక్రవారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అందులో భువనేశ్వర్కు చోటు దక్కలేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా భువీ రెండో రోజు (శనివారం) కూడా అద్భుతమైన బౌలింగ్ కొనసాగించాడు. రంజీ ట్రోఫీలో అతడు మున్మందు కూడా ఇదే విధంగా రాణిస్తే ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టులకు ఎంపికయ్యే అవకాశముంది.
దుమ్మురేపుతున్న ‘ట్వెల్త్ ఫెయిల్’.. దర్శకుడి కుమారుడు
బాలీవుడ్ దర్శకుడు విధూ వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra) కుమారుడు అగ్ని చోప్రా (Agni Chopra) రంజీ ట్రోఫీలో దుమ్మురేపుతున్నాడు. అరంగేట్రంలోనే భారీ శతకం బాదిన అతడు సూపర్ ఫామ్ని కొనసాగిస్తున్నాడు. మిజోరం తరఫున ఆడుతున్న ఈ 25 కుర్రాడు సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో (166; 179 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్లు) సంచలన ఆటతీరుతో శతకం బాదాడు. రెండో ఇన్నింగ్స్లోనూ (92; 74 బంతుల్లో) రాణించాడు. కానీ, ఆ మ్యాచ్లో మిజోరం నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ప్రస్తుతం నాగాలాండ్తో జరుగుతున్న మ్యాచ్లోనూ అగ్ని చోప్రా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో (164; 150 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్లు) మరోసారి భారీ శతకం సాధించాడు. దీంతో మిజోరం 356 పరుగులకు ఆలౌటైంది. ఇటీవల విడుదలైన ‘ట్వెల్త్ ఫెయిల్’ చిత్రం విశేష ఆదరణ సొంతం చేసుకుంది. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను విధూ వినోద్ చోప్రా తెరకెక్కించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి