Virat Kohli: విరాట్ కోహ్లీ.. నువ్వు ఆ ఓవర్లలో క్రీజ్లోనే ఉండాలి: ఏబీ డివిలియర్స్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాణిస్తున్నా.. మిగతా వారినుంచి అంతగా సహకారం లభించడం లేదు. బౌలింగ్లోనూ తేలిపోతూ బెంగళూరు జట్టు ఓటములను చవిచూస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు (Bengaluru) పరిస్థితి దారుణంగా ఉంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన గత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. లోయర్ ఆర్డర్లో దినేశ్ కార్తిక్ రాణిస్తుండటంతో ప్రత్యర్థుల ముందు ఓ మాదిరి స్కోర్లను ఉంచగలుగుతోంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రం దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. టీ20ల్లో దూకుడుగా ఆడే మ్యాక్సీ మాత్రం తేలిపోవడం గమనార్హం. ఇక బౌలింగ్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ క్రమంలో బెంగళూరు టైటిల్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇలా జరగాలంటే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిడిల్ ఓవర్లలో క్రీజ్లో ఉండాలని.. ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. దీనివల్ల జట్టు సమతూకంగా ఉంటుందని పేర్కొన్నాడు.
‘‘విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రారంభాన్ని టోర్నీ ఆసాంతం కొనసాగస్తాడని ఆశిస్తున్నా. బెంగళూరు మిడిల్ ఓవర్లలో పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. తొలి ఆరు ఓవర్లలో విరాట్ ఆటను చూస్తున్నాం. ఫాఫ్ డుప్లెసిస్ కూడా రిస్క్ తీసుకోవాలి. కానీ, కోహ్లీని 6 నుంచి 15 ఓవర్ల మధ్య క్రీజ్లో ఉండటం చూడాలని ఉంది. అప్పుడే బెంగళూరు జట్టులోని అందరూ మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు బెంగళూరు ప్రయాణం మరీ దారుణంగా ఏమీ లేదు. టోర్నీలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. వచ్చే మ్యాచుల్లో విజయం సాధిస్తే ముందుకురావచ్చు. మళ్లీ సొంత మైదానంలో ఆడేలోగా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండేందుకు ప్రయత్నించాలి’’ అని ఏబీడీ తెలిపాడు.
షాన్ టైట్ మాదిరి పేసర్ మయాంక్: గ్లెన్ మ్యాక్స్వెల్
ఐపీఎల్లో అందర్నీ ఆకట్టుకున్న పేసర్ మయాంక్ యాదవ్. గంటకు 150 కి.మీ. వేగంతో నిలకడగా బంతులను సంధిస్తున్న అతడు.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ను వేశాడు. ఈక్రమంలో మయాంక్ను తమ మాజీ క్రికెటర్ షాన్ టైట్తో పోలుస్తూ మ్యాక్స్వెల్ ప్రశంసించాడు. ‘‘పంజాబ్పై అద్భుతంగా బంతులేసిన తర్వాత.. అతడి బౌలింగ్పై నేనూ వర్కౌట్ చేశా. అయితే, అవేవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి బౌలర్ను నేరుగా ఎదుర్కొంటేనే అనుభవం వస్తుంది. నాకు కొద్ది ఎత్తులో బౌన్సర్ను సంధించాడు. అదే నేను ఎదుర్కొన్న తొలి బంతి. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో వచ్చింది. ఆ తర్వాత బంతికే నేను ఔటయ్యా. ఇతర బౌలర్లతో పోలిస్తే కాస్త అదనంగా పేస్ను రాబట్టాడు. మా జట్టులో షాన్ టైట్ కూడా ఇలాంటి ఫాస్ట్తో బౌలింగ్ చేసేవాడు’’ అని మ్యాక్సీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్