Virat Kohli: విరాట్ కోహ్లీ.. నువ్వు ఆ ఓవర్లలో క్రీజ్లోనే ఉండాలి: ఏబీ డివిలియర్స్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రాణిస్తున్నా.. మిగతా వారినుంచి అంతగా సహకారం లభించడం లేదు. బౌలింగ్లోనూ తేలిపోతూ బెంగళూరు జట్టు ఓటములను చవిచూస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు (Bengaluru) పరిస్థితి దారుణంగా ఉంది. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన గత మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. లోయర్ ఆర్డర్లో దినేశ్ కార్తిక్ రాణిస్తుండటంతో ప్రత్యర్థుల ముందు ఓ మాదిరి స్కోర్లను ఉంచగలుగుతోంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ మాత్రం దారుణమైన ప్రదర్శనతో నిరాశపరిచారు. టీ20ల్లో దూకుడుగా ఆడే మ్యాక్సీ మాత్రం తేలిపోవడం గమనార్హం. ఇక బౌలింగ్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఈ క్రమంలో బెంగళూరు టైటిల్ రేసులో నిలవాలంటే ఇకపై ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇలా జరగాలంటే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిడిల్ ఓవర్లలో క్రీజ్లో ఉండాలని.. ఒకప్పటి సహచరుడు ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. దీనివల్ల జట్టు సమతూకంగా ఉంటుందని పేర్కొన్నాడు.
‘‘విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రారంభాన్ని టోర్నీ ఆసాంతం కొనసాగస్తాడని ఆశిస్తున్నా. బెంగళూరు మిడిల్ ఓవర్లలో పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. తొలి ఆరు ఓవర్లలో విరాట్ ఆటను చూస్తున్నాం. ఫాఫ్ డుప్లెసిస్ కూడా రిస్క్ తీసుకోవాలి. కానీ, కోహ్లీని 6 నుంచి 15 ఓవర్ల మధ్య క్రీజ్లో ఉండటం చూడాలని ఉంది. అప్పుడే బెంగళూరు జట్టులోని అందరూ మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు బెంగళూరు ప్రయాణం మరీ దారుణంగా ఏమీ లేదు. టోర్నీలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. వచ్చే మ్యాచుల్లో విజయం సాధిస్తే ముందుకురావచ్చు. మళ్లీ సొంత మైదానంలో ఆడేలోగా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండేందుకు ప్రయత్నించాలి’’ అని ఏబీడీ తెలిపాడు.
షాన్ టైట్ మాదిరి పేసర్ మయాంక్: గ్లెన్ మ్యాక్స్వెల్
ఐపీఎల్లో అందర్నీ ఆకట్టుకున్న పేసర్ మయాంక్ యాదవ్. గంటకు 150 కి.మీ. వేగంతో నిలకడగా బంతులను సంధిస్తున్న అతడు.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ను వేశాడు. ఈక్రమంలో మయాంక్ను తమ మాజీ క్రికెటర్ షాన్ టైట్తో పోలుస్తూ మ్యాక్స్వెల్ ప్రశంసించాడు. ‘‘పంజాబ్పై అద్భుతంగా బంతులేసిన తర్వాత.. అతడి బౌలింగ్పై నేనూ వర్కౌట్ చేశా. అయితే, అవేవీ సత్ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి బౌలర్ను నేరుగా ఎదుర్కొంటేనే అనుభవం వస్తుంది. నాకు కొద్ది ఎత్తులో బౌన్సర్ను సంధించాడు. అదే నేను ఎదుర్కొన్న తొలి బంతి. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో వచ్చింది. ఆ తర్వాత బంతికే నేను ఔటయ్యా. ఇతర బౌలర్లతో పోలిస్తే కాస్త అదనంగా పేస్ను రాబట్టాడు. మా జట్టులో షాన్ టైట్ కూడా ఇలాంటి ఫాస్ట్తో బౌలింగ్ చేసేవాడు’’ అని మ్యాక్సీ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం. -
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
శ్రీలంకతో టీమ్ ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు ఫార్మాట్లకు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. -
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ