Ishan Kishan: ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్కూ అందుబాటులో లేడా?
టీమ్ఇండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటు టీమ్ఇండియాకు ఎంపిక కాకపోవడం.. అటు రంజీల్లో ఆడకపోవడం అతడికి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్న భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) అఫ్గాన్తో జరగనున్న సిరీస్కూ ఎంపిక కాలేదు. టీ20 సిరీస్ ఆడాలని భావించినా.. సెలక్టర్లు మాత్రం అతడిని పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే ఇషాన్పై చర్యలు తీసుకున్నారన్న కథనాలను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొట్టిపడేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడి రావాలని అతడికి సూచించాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు వికెట్ కీపర్గా కేఎస్ భరత్ కూడా రేసులో ఉన్నాడు. అయితే, రంజీల్లో ఆడేందుకూ ఇషాన్ ఆసక్తిగా లేనట్లు సమాచారం. అతడి ప్రాతినిధ్యంపై ఝార్ఖండ్ క్రికెట్ సంఘం ఇప్పటి వరకూ ధ్రువీకరించలేదు.
‘‘ఇషాన్ విషయంలో మాకు స్పష్టత లేదు. అతడు రంజీ ట్రోఫీ కోసం అందుబాటులో ఉంటానని చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా సరే నేరుగా తుది జట్టులో ఆడిస్తాం’’ అని ఆ సంఘం కార్యదర్శి దేబశిశ్ చక్రవర్తి పేర్కొన్నారు. ‘మానసిక అలసట’ కారణంగా క్రికెట్కు దూరంగా ఉన్న ఇషాన్ దుబాయ్ పార్టీలకు వెళ్లడంతోనే బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసిందనే కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు రంజీల్లో ఆడకపోతే ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేయడం కష్టమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
రంజీల్లో శ్రేయస్ అయ్యర్, అజింక్య
శ్రేయస్ అయ్యర్ విషయంలోనూ క్రమశిక్షణా చర్యలే కారణమంటూ వచ్చిన వార్తలను ద్రవిడ్ ఖండించాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను కూడా అయ్యర్ ఆడలేదని గుర్తు చేశాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో తన ఫామ్ను అందిపుచ్చుకోవడానికి అతడు రంజీ బరిలోకి దిగాడు. ముంబయి తరఫున ఆంధ్రా జట్టుపై ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లో ఆడని అంజిక్య రహానె తన సత్తా చాటేందుకు వచ్చాడు. కెప్టెన్గా ముంబయి జట్టును నడిపిస్తున్నాడు. సౌరాష్ట్ర తరఫున తొలి మ్యాచ్లో ఝార్ఖండ్పై డబుల్ సెంచరీ సాధించిన పుజారా.. హరియాణాతోనూ బరిలోకి దిగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి