ODI World Cup 2023: వచ్చేస్తోంది వన్డే సంబరం
పొట్టి క్రికెట్లో రెండేళ్లకో ప్రపంచకప్ చూస్తున్నాం. ఏడాది వ్యవధిలోనూ రెండు టీ20 ప్రపంచకప్లు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. టెస్టుల్లోనూ ప్రపంచ ఛాంపియన్షిప్లు జరుగుతున్నాయి
ఇంకో 50 రోజుల్లోనే ప్రపంచకప్
పొట్టి క్రికెట్లో రెండేళ్లకో ప్రపంచకప్ చూస్తున్నాం. ఏడాది వ్యవధిలోనూ రెండు టీ20 ప్రపంచకప్లు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. టెస్టుల్లోనూ ప్రపంచ ఛాంపియన్షిప్లు జరుగుతున్నాయి. కానీ క్రికెట్ అభిమానులకు అసలైన ప్రపంచకప్ అంటే వన్డే ట్రోఫీనే. దానికున్న చరిత్ర వేరు. దాని విలువ వేరు. ప్రపంచంలో ప్రతి క్రికెటరూ అందుకోవాలనుకునే ట్రోఫీ అది. ప్రతి క్రికెట్ అభిమానిలోనూ ఉద్వేగాన్ని రేకెత్తించే టోర్నీ అది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సరిగ్గా ఇంకో 50 రోజులే ఉంది. సారి మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తుండటం మన అభిమానులకు మరింత ప్రత్యేకం. సొంతగడ్డపై రోహిత్ సేన భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్ సమీపిస్తుండగా అందులో పోటీ పడే జట్లన్నీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో ఉండగా.. ఐసీసీ, బీసీసీఐ టోర్నీ సన్నాహాల్లో మునిగిపోయి ఉన్నాయి. ఇక అభిమానులేమో ఇప్పటిదాకా జరిగిన ప్రపంచకప్ల తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ... కొత్త టోర్నీ కోసం ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈసారి ప్రపంచకప్ను ప్రత్యేకంగా మార్చే అనేక విశేషాలు ఆ టోర్నీతో ముడిపడి ఉన్నాయి.
- ఇప్పుడు జరగబోయేది 13వ వన్డే ప్రపంచకప్. ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతుండటమిది నాలుగోసారి. 1987లో తొలిసారి పాకిస్థాన్తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. 1996లో ప్రపంచకప్ నిర్వహణలో భారత్కు పాకిస్థాన్, శ్రీలంక తోడయ్యాయి. 2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ కలిసి ఉమ్మడిగా టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. తొలిసారి భారత్ మాత్రమే ప్రపంచకప్ను నిర్వహించబోతోంది.
- వన్డే ప్రపంచకప్ను ఆస్ట్రేలియా అత్యధికంగా అయిదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) గెలిచింది. భారత్ (1983, 2011), వెస్టిండీస్ (1975, 1979) రెండుసార్లు చొప్పున కప్పు నెగ్గాయి. పాకిస్థాన్ (1992), శ్రీలంక (1996), ఇంగ్లాండ్ (2019) ఒక్కోసారి టైటిల్ సాధించాయి. పెద్ద జట్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మాత్రమే ఇంకా కప్పు గెలవలేదు.
- 1983లో తొలిసారి కపిల్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్ను సొంతం చేసుకున్న భారత్.. 28 ఏళ్ల తర్వాత 2011లో ధోని సారథ్యంలో ఆ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో కప్పు వేటకు సిద్ధమవుతోంది.
- 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లలో ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే ప్రస్తుత జట్టులో సభ్యుడు.
- అక్టోబరు 5న 2019 ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్తో మొదలయ్యే ప్రపంచకప్ నవంబరు 19న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. టోర్నీలో 45 లీగ్ మ్యాచ్లు సహా మొత్తం 48 మ్యాచ్లు జరుగుతాయి.
- ఈసారి టోర్నీలో పది జట్లు పోటీ పడుతుండగా.. లీగ్ దశలో ప్రతి జట్టూ మిగతా తొమ్మిది జట్లలో ఒక్కో లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో టాప్-4లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి.
- ఆరంభ, ఫైనల్ మ్యాచ్లకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. హైదరాబాద్ మూడు లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిస్తుంది. అయితే ఇక్కడి ఉప్పల్ స్టేడియానికి భారత్ మ్యాచ్ను మాత్రం కేటాయించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
ప్లేఆఫ్స్ తొలి పోరు... రైడర్స్పై సన్ ‘రైజ్’ అయితే ఫైనల్కు!
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫయర్-1లో సన్రైజర్స్ (Sunrisers Hyderabad)ను కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఢీకొంటుంది. -
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్
అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మకు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసునని.. అది జట్టుకు కచ్చితంగా ఉపయోగపడుతుందని వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో లీగ్ స్టేజ్ను దాటి ప్లేఆఫ్స్ పోరు మొదలుకానుంది. అనూహ్య ఫలితాలతో నాకౌట్కు చేరి ఆశ్చర్చపరిచిన జట్లూ ఉన్నాయి. -
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
ఐపీఎల్ ముగిసిన తర్వాత.. దాదాపు వారం రోజుల్లో భారత ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్లో ఆడనున్నారు. ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. -
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ప్లేఆఫ్స్కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. -
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో ఓపెనర్గా అభిషేక్ శర్మదీ కీలక పాత్రే. మరో ఆటగాడు ట్రావిస్ హెడ్తో కలిసి అదిరే ఆరంభాలను ఇచ్చాడు. -
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతం చేసింది. ఊహించని విధంగా నాకౌట్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. -
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే