BCCI - Stephen Fleming: కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
భారత ప్రధాన కోచ్ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి పొడిగింపుపై ఇంట్రెస్ట్గా లేడు. ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం కోరిన సంగతి తెలిసిందే. కొత్త కోచ్ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచ కప్ వరకు సేవలందిస్తాడు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 డెడ్లైన్. ఈ క్రమంలో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, దిల్లీ కోచ్ రికీ పాంటింగ్తోపాటు కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈసారి విదేశీ కోచ్ను తీసుకొనేందుకు బీసీసీఐ మొగ్గు చూపిస్తుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్లోని పరిస్థితులు, ఆటగాళ్లను అర్థం చేసుకోవడంలో అందరికంటే ఫ్లెమింగ్ ముందున్నాడనేది కొందరి వాదన. అంతేకాదు.. ఇందుకోసం బీసీసీఐ ధోనీ సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్ను ఒప్పించాలని మహీని బోర్డు సంప్రదించినట్లు సమాచారం. కొత్తగా కోచింగ్ బాధ్యతలు చేపట్టే వ్యక్తి సంవత్సరంలో కనీసం పది నెలలపాటు భారత జట్టుతో ఉండాల్సి ఉంటుంది. అయితే, స్టీఫెన్ ఫ్లెమింగ్ అసలు పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అనేది ఇంకా తెలియలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్లెమింగ్ను పొగడ్తలతో ముంచెత్తుతూ పోస్టు పెట్ట్టింది. మరోవైపు సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ మాత్రం ఫ్లెమింగ్తో దీని గురించి చర్చే జరగలేదని స్పష్టం చేశారు. ‘‘ప్రధాన కోచ్ పదవి గురించి నేనేమీ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదు. స్టీఫెన్ నుంచి కూడా మాకు దానిపై సమాచారం లేదు’’ అని పేర్కొన్నారు.
ఆ ఇద్దరు కూడా..?
ప్రధాన కోచ్ రేసులో పైన ముగ్గురే కాకుండా.. శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబయి కోచ్గా వ్యవహరించిన మహేల జయవర్థెనె పేరు కూడా కొత్తగా చర్చకొచ్చింది. అయితే, ఇప్పటివరకు తాను దరఖాస్తు కూడా చేయలేదని.. ఎవరూ సంప్రదించలేదని జయవర్థెనె వెల్లడించాడు. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ మంచి ఎంపిక అవుతుందని కొందరి అభిప్రాయం. కంగారూల జట్టును టీ20, వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిపిన అనుభవం అతడి సొంతం. ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత్ జట్టు కోచింగ్ బాధ్యతలు అత్యంత కఠినమైనవిగా లాంగర్ పేర్కొన్నాడు. ‘‘భారీ అంచనాలు, అత్యంత విలువైన జట్టుకు కోచ్గా ఉండటం చాలా ఒత్తిడితో కూడుకున్నదే. అద్భుత అవకాశమే కాకుండా జట్టును ఐసీసీ టైటిల్స్ విజేతగా నిలిపితే గొప్ప గౌరవం దక్కుతుంది’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..