Anand Mahindra: నా పేరులో ‘మహీ’ ఉండటం గర్వంగా ఉంది.. ధోనీ సిక్స్లపై ఆనంద్ మహీంద్రా
ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సిక్స్లతో అదరగొట్టిన ధోనీపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్ను చిత్తుగా ఓడించి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది చెన్నై సూపర్కింగ్స్. మ్యాచ్ చివర్లో రంగంలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సిక్స్లతో అదరగొట్టాడు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ఆయన ‘ఎప్పటికీ గొప్ప ఫినిషర్’ అంటూ మహీపై ప్రశంసల జల్లు కురిపించారు.
‘‘ధోనీ కంటే గొప్పగా రాణిస్తున్న క్రీడాకారుడిని ఒకరినైనా చూపించగలరా? అతడిపై ఉన్న అంచనాలు కావొచ్చు. జట్టు పరిస్థితి తీసుకొచ్చే ఒత్తిడి కారణమై ఉండొచ్చు. ఇవన్నీ ఆయన సంకల్పాన్ని మరింత పెంచాయి. ఆయన ఎప్పటికీ గొప్ప ఫినిషర్. నా పేరులో కూడా ‘మహీ’ ఉండటం గర్వంగా ఉంది’’ అని మహీంద్రా ప్రశంసించారు. ఆయన పోస్టుకు ‘మిస్టర్ కూల్’ ఫొటోను జత చేశారు.
హార్దిక్ను గేలిచేసింది చాలు.. అలాంటి మాటలతో విసిగిపోయా: కీరన్ పొలార్డ్
వైరల్గా మారిన మహీంద్రా పోస్టుపై ఇప్పటివరకు మిలియన్కు పైగా నెటిజన్లు స్పందించారు. ‘‘మహీ అండ్ మహీంద్రా ఎప్పటికీ ఎవర్ గ్రీన్’’.. ‘‘ధోనీ కొట్టిన సిక్స్లు ఆకాశాన్నంటాయి. లవ్ యూ మహీ’’ అని కామెంట్లు గుప్పించారు. కాగా.. ఐపీఎల్-17లో ఆదివారం ముంబయిలోని వాంఖడె స్టేడియం వేదికగా జరిగిన పోరులో 20 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్పై సీఎస్కే గెలిచింది. మ్యాచ్ చివర్లో వచ్చిన మహీ వరుసగా మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టాడు. కాలి నొప్పితోనే బ్యాటింగ్ చేసిన ధోనీ.. ఫినిషర్ పాత్రకు ఎప్పటిలాగే న్యాయం చేసి మరింత అభిమానాన్ని గెలుచుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్