Anand Mahindra: కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
Anand Mahindra: ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన బెంగళూరు జట్టు, కోహ్లీపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. కింగ్ కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ ఎన్నో ఆసక్తికర విషయాలు, ప్రేరణ కలిగించే వీడియోలను పంచుకుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). తాజాగా ఆయన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అనూహ్యంగా దూసుకొచ్చిన బెంగళూరు జట్టు, కోహ్లీ (Virat Kohli) కంటే స్ఫూర్తినిచ్చేవారు ఎవరుంటారని ప్రశంసించారు.
‘‘పొరపాట్లు చేసినప్పుడు, కింద పడిపోయినప్పుడు వాటిని సరిదిద్దుకుని తిరిగి పైకి లేచే వ్యక్తులపై మా కంపెనీ విశ్వాసంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రయత్నాన్ని వదిలిపెట్టొద్దు. అలాంటివారిని మేం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం. అభినందిస్తాం. ఈ మండే మోటివేషన్లో కింగ్ కోహ్లీ, బెంగళూరు కంటే మించి మనకు స్ఫూర్తి కలిగించేవారు ఇంకెవరున్నారు?’’ అని మహీంద్రా రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘సరిగ్గా చెప్పారు సర్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
ఈ ఐపీఎల్ టోర్నీలో బెంగళూరు ఆఖరి నిమిషంలో ప్లేఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది మ్యాచ్ల్లో ఒకేఒక్క గెలుపుతో తొలుత పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి అనూహ్యంగా టాప్-4లో చోటు దక్కించుకుంది. మంచి ఫామ్తో ఆకట్టుకుంటున్న విరాట్.. బెంగళూరు ప్రయాణంలో కీలక పాత్ర పోషించాడు. ఎలిమినేటర్ మ్యాచ్లో ఈ జట్టు రాజస్థాన్తో తలపడనుంది. అక్కడ గెలిస్తే క్వాలిఫయర్- 2కు అర్హత సాధిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ అందుకోని బెంగళూరు ఈసారి ఆ కల నేరవేర్చుకోవాలని అభిమానులు ఆశ పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
రెండోసారి టైటిల్ను నెగ్గాలనే లక్ష్యంతో టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగింది. జూన్ 5న తొలి మ్యాచ్లో ఆడనుంది. -
ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గి
టీ20 ప్రపంచకప్ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మునుపెన్నడూ లేనంత ఫిట్గా కనిపిస్తున్నాడు. -
గంభీర్ మంచి కోచ్ అవుతాడు: గంగూలీ
దరఖాస్తు చేసుకుని ఉంటే టీమ్ఇండియాకు గౌతమ్ గంభీర్ మంచి కోచ్ కాగలడని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
పడిపోదాం పొట్టి కప్పు మాయలో!
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఇష్టపడే టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్ ఆదివారమే శ్రీకారం చుట్టుకోనుంది. -
వార్మప్ భలే..
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు టీమ్ఇండియాకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం రోహిత్ సేన 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. -
కార్తీక్ గుడ్బై చెప్పేశాడు
అన్ని రకాల పోటీ క్రికెట్కు టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అధికారికంగా గుడ్బై చెప్పేశాడు. శనివారం తన 39వ పుట్టిన రోజు సందర్భంగా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. -
ఒలింపిక్స్ కోటాకు అడుగు దూరంలో
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలను సొంతం చేసుకునేందుకు భారత బాక్సర్లు జైస్మిన్, సచిన్ అడుగు దూరంలో నిలిచారు. శనివారం మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ క్వార్టర్స్ చేరింది. -
భారత్ 3.. జర్మనీ 0
ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్ లండన్ అంచెను భారత్ విజయంతో ఆరంభించింది. శనివారం 3-0తో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించింది. -
సబలెంక జోరు
ఫ్రెంచ్ ఓపెన్లో రెండోసీడ్ సబలెంక జోరు మీదుంది. ఆ బెలారస్ అమ్మాయి ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంక 7-5, 6-1తో పౌలా బదోసా (స్పెయిన్)ను ఓడించింది. -
గాయత్రి జోడీ ఓటమి
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ అద్భుత పోరాటానికి తెరపడింది. -
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
టీ20 ప్రపంచకప్నకు ముందు శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి సన్నివేశం అభిమానులకు ట్రీటే: డైరెక్టర్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
-
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
-
అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్రెడ్డి నివాళి
-
రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్