Archery Medals: విలువిద్యలో వెల్లువలా... పతకాల పంట పండిస్తున్న ఆర్చర్లు
జ్యోతి సురేఖ (Jyothi Vennam), అదితి స్వామి (Aditi Swami), పర్ణీత్ కౌర్ (Parneet Kaur), పార్థ్ సాలుంకె (Parth Salunkhe), ఒజాస్ ప్రవీణ్ (Ojas Pravin)... భారత ఆర్చరీలో ఆ మాటకొస్తే ప్రపంచ ఆర్చరీలో వీరి గురించే ఇప్పుడు చర్చ. అంతగా వీరు ఏం సాధించారు, దేశానికి ఏం ఘనత తెచ్చిపెట్టారో మీరే చదవండి.
అత్యంత పోటీ ఉండే ప్రపంచ ఛాంపియన్షిప్స్ అయినా.. ఉత్తమ ఆర్చర్లు బరిలో దిగే ప్రపంచకప్ పోటీలైనా.. ఆసియా ఛాంపియన్షిప్స్ అయినా.. మరో అంతర్జాతీయ టోర్నీ అయినా.. మన ఆర్చర్ల ‘గురి’ తప్పడం లేదు. విలువిద్యలో వెల్లువలా పతకాలు వచ్చి చేరుతున్నాయి. పోటీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. మన ఆర్చర్లు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. చారిత్రక విజయాలతో.. సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతున్నారు. విల్లు ఎక్కుపెట్టి.. పతకాల గురి చూసి బాణాలు విసురుతున్నారు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో భారత ఆర్చర్లదే ఆధిపత్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్స్లో అద్భుత ప్రదర్శన చేసిన మన ఆర్చర్లు.. ఇప్పుడు ప్రపంచకప్ నాలుగో అంచె పోటీల్లోనూ పతకాల వేటలో సాగుతున్నారు. రికర్వ్ పురుషుల, మహిళల జట్లు కాంస్యాలు నెగ్గగా.. కాంపౌండ్ పురుషుల, మహిళల జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వ్యక్తిగత విభాగంలో సెమీస్ చేరి పతకం దిశగా దూసుకెళ్తోంది.
మన దిగ్గజం..
ఇటీవల బెర్లిన్లో ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్స్ జరిగింది. అందులో భారత మహిళల కాంపౌండ్ జట్టు.. టీమ్ విభాగంలో పసిడితో చరిత్ర సృష్టించింది. అప్పటివరకూ చేరని ఘనత అప్పుడే సొంతమైంది. ఈ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్స్ చరిత్రలో భారత్కు దక్కిన మొట్టమొదటి పసిడి అది. ఇందులో కీలక పాత్ర పోషించింది మన విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam). యువ సంచలనాలు అదితి స్వామి (Aditi Gopichand Swami), పర్ణీత్ కౌర్ (Parneet Kaur)తో కలిసి జట్టును టైటిల్ దిశగా నడిపించింది 27 ఏళ్ల సీనియర్ జ్యోతి.
బిజినెస్ క్లాస్లో తొలిసారి ప్రయాణం.. రింకు సింగ్ రియాక్షన్ ఏంటంటే?
అప్పటికే అయిదు ప్రపంచ ఛాంపియన్షిప్స్ ఆడి.. ఆరు (నాలుగు రజతాలు, రెండు కాంస్యాలు) పతకాలు సాధించిన ఆ కాంపౌండ్ ఆర్చరీ దిగ్గజం.. ఇప్పుడు తొలిసారి స్వర్ణాన్ని ముద్దాడింది. వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం సాధించేలా కనిపించిన జ్యోతి.. సెమీస్లో అదితి చేతిలో ఓడింది. ఆ తర్వాత కాంస్య పతక పోరులో నెగ్గి.. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో తన పతకాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకుంది. ఇప్పటివరకూ మరే భారత ఆర్చర్ కూడా ప్రపంచ ఛాంపియన్షిప్స్లో ఇన్ని పతకాలు నెగ్గలేదు. భవిష్యత్లో గెలుస్తారా? అంటే అవునని కచ్చితంగా సమాధానం చెప్పలేం!
టీనేజర్ల జోరు..
మొన్నటి వరకూ కాంపౌండ్ మహిళల ఆర్చరీ అంటే జ్యోతి సురేఖ పేరు వినిపించేది. కానీ, ఇప్పుడు తామున్నామంటూ యువ ఆర్చర్లు దూసుకొస్తున్నారు. పిన్న వయస్సులోనే ప్రపంచ ఆర్చరీని శాసిస్తున్నారు. భవిష్యత్ మనదే అనే ధీమా కలిగిస్తున్నారు. 17 ఏళ్లకే మహారాష్ట్ర ఆర్చర్ అదితి గోపీచంద్ స్వామి.. సీనియర్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచి సంచలనం నమోదు చేసింది. అతి పిన్న వయస్సు ప్రపంచ ఛాంపియన్ ఆమెనే. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ఆర్చర్గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. వ్యక్తిగత స్వర్ణంతో పాటు టీమ్ పసిడిని కూడా ఖాతాలో వేసుకున్న ఆమె.. ఈ ఏడాది అండర్-18లోనూ ప్రపంచ ఛాంపియన్గా నిలవడంతో పాటు టీమ్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
చిన్న వయసులోనే అద్భుతమైన గురితో గొప్ప పరిణతి ప్రదర్శిస్తూ ఆమె సాగుతోంది. పంజాబ్కు చెందిన 18 ఏళ్ల పర్ణీత్ కౌర్ ఇప్పటికే అండర్-18, అండర్-21, సీనియర్ టీమ్ స్వర్ణాలు సొంతం చేసుకుంది. అదితి గ్రామం నుంచే వచ్చిన 19 ఏళ్ల పార్థ్ సాలుంకె (Parth Salunkhe) ఒలింపిక్స్ క్రీడాంశమైన రికర్వ్ ఆర్చరీలో అండర్-21 ప్రపంచ యూత్ ఛాంపియన్గా నిలిచిన తొలి భారత ఆర్చర్గా రికార్డుల్లోకెక్కాడు. అతని ఖాతాలో మిక్స్డ్ టీమ్, టీమ్ స్వర్ణాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రకే చెందిన మరో ఆర్చర్ 21 ఏళ్ల ఒజాస్ ప్రవీణ్ (Ojas Pravin Deotale) కాంపౌండ్ ప్రపంచ టైటిల్ సాధించిన తొలి భారత పురుష ఆర్చర్గా అవతరించాడు. వీళ్ల ప్రదర్శన చూస్తుంటే భవిష్యత్లో భారత ఆర్చరీకి తిరుగులేదనిపిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన