Dhoni- Ashwin: నేనూ అతడి నాయకత్వంలో ఆడా.. కెప్టెన్గా ధోనీ సక్సెస్ సీక్రెట్ అదే: అశ్విన్
ధోనీ నాయకత్వంలో (MS Dhoni) ఒక్కసారి ఆడినా చాలు జీవితాంతం గుర్తుండిపోతుంది. టీమ్ఇండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin) కూడా మరోసారి ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో (WTC Final 2023) భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం తుది జట్టులో అశ్విన్ లేకపోవడమేనని మాజీలు చెబుతుంటారు. అలాగే తొలుత బౌలింగ్ ఎంచుకోవడం కూడా తప్పిదమేనని విమర్శలు వచ్చాయి. సరిగ్గా పదేళ్ల కిందట ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా భారత్ ఖాతాలో పడలేదు. ఈ క్రమంలో సోషల్మీడియా వేదికగా టీమ్ఇండియాపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. వాటన్నింటిపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు.
వారికి అర్హత ఉంది..
డబ్ల్యూటీసీ ఫైనల్ గదను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు. ఫైనల్లో విజేతగా నిలవడానికి వారికి అర్హత ఉంది. మార్నస్ లబుషేన్ ఇక్కడే కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం అక్కరకొచ్చింది. అయితే, కేవలం ఒక్క టెస్టుతోనే తేలిపోవడం వల్ల ఎవరు ఎలా ఆడారనేది చెప్పడం కష్టమే. కానీ, విజేతగా నిలవడానికి మాత్రం ఆసీస్కు అర్హత ఉంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకోవడంలో ఆసీస్ విఫలమైంది. టీమ్ఇండియా మాదిరిగా ఆస్ట్రేలియా కూడా నిలకడగా టెస్టు క్రికెట్ ఆడుతుంది.
పదేళ్ల నుంచి..
గత పదేళ్ల నుంచి మేం ఒక్క ఐసీసీ ట్రోఫీని నెగ్గలేదనే బాధ, ఆవేశం అభిమానుల్లో ఉండటం అర్థం చేసుకోదగినదే. ఫ్యాన్స్కు నా సానుభూతి తెలుపుతున్నా. ప్రతి కీలక మ్యాచ్కు ఫలానా ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోండి. మరో ఆటగాడిని తీసేయండంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతుంటారు. ఎంతటి నాణ్యమైన ఆటగాడైనా సరే రాత్రికి రాత్రే పెను మార్పులు తీసుకురాలేడు. చాలా మంది ఎంఎస్ ధోనీ నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. అతడు ఏం చేశాడు? క్లిష్టమైన విషయాలను కూడా చాలా సాధారణంగా మార్చేసేవాడు. అతడి నాయకత్వంలో నేనూ ఆడా. ఏదైనా సిరీస్కు లేదా టోర్నీకి 15 మంది స్క్వాడ్ను తీసుకుంటే తుది జట్టులోకి వచ్చే 11 మందితోనే మొత్తం ఆడిస్తాడు. దాని వల్ల జట్టులో తమ స్థానం భద్రంగా ఉంటుందనే భరోసా వస్తుంది. మరింత రాణించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని అశ్విన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
ఐపీఎల్ 17 (IPL) సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. -
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
కెప్టెన్ కేఎల్ రాహుల్పై ఆ జట్టు యజమాని ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై లఖ్నవూ టీమ్ స్పందించింది. -
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. -
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
మైదానంలో ఎంతో చురుగ్గా ఉండే విరాట్ కోహ్లీ(Virat Kohli).. ప్రత్యర్థి వికెట్ పడితే తనదైన శైలిలో సంబరాలు చేసుకుంటాడు. -
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
ఐపీఎల్ 2024 (IPL)సీజన్ చివరి దశకు చేరుకున్నా ఇప్పటివరకు ఒకే జట్టు ప్లేఆఫ్స్కు చేరుకుంది. మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. -
అదే మమ్మల్ని దెబ్బతీసింది.. లేదంటే బెంగళూరును 150కే కట్టడి చేసేవాళ్లం: అక్షర్
Bengaluru vs Delhi: కీలక మ్యాచ్లో బెంగళూరు చేతిలో దిల్లీ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలను దూరం చేసుకుంది. -
పాత మిత్రుడు కనిపించగానే ధోనీ ఏం చేశాడంటే..!
ధోనీ-రైనా జోడీ మైదానంలో చెన్నై అభిమానులకు కనువిందు చేసింది. -
ఆర్సీబీ.. ఆశల పల్లకిలో
నిజంగా ఇది ఎవరూ ఊహించనిదే. ఎప్పుడో కథ ముగిసిన జట్టుగా కనిపించిన ఆర్సీబీ వరుసగా అయిదో విజయంతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. రజత్ పటీదార్ బ్యాటింగ్ మెరుపులకు బౌలర్ల శ్రమ తోడవడంతో దిల్లీని చిత్తుగా ఓడించిన ఆ జట్టు.. మొత్తంగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి దూసుకెళ్లింది. -
చెన్నై గట్టెక్కింది
చెన్నై నిలిచింది. సొంతగడ్డ చెపాక్లో అదరగొట్టి ప్లేఆఫ్స్కు చేరువైంది. పెద్దగా మెరుపుల్లేని.. భారీస్కోర్లు నమోదుకాని పోరులో రాజస్థాన్ను ఓడించిన సీఎస్కే 13 మ్యాచ్ల్లో ఏడో విజయంతో మూడో స్థానానికి చేరుకుంది. -
ధోని మళ్లీ చెన్నైకి వస్తాడా?
ఆదివారం రాజస్థాన్తో మ్యాచ్ అనంతరం చెపాక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణం కనిపించింది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ఊహాగానాల నేపథ్యంలో చెపాక్లో మళ్లీ అతణ్ని చూస్తామో లేదో అని అభిమానుల్లో అన్న సందేహాలు నెలకొన్నాయి. -
అందుకే జడేజా ఔట్
రాజస్థాన్తో మ్యాచ్లో జడేజా ఔట్ చర్చనీయాంశమైంది. ఫీల్డింగ్కు అవరోధం కలిగించాడనే కారణంతో మూడో అంపైర్ జడేజాను ఔట్గా ప్రకటించాడు. అవేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అయిదో బంతిని ఆడిన జడేజా రెండో పరుగుకు ప్రయత్నించాడు. -
కోట్లు వస్తున్నాయిగా.. ఇంకేంటి బాధ?
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకాపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో లఖ్నవూ చిత్తుగా ఓడిన తర్వాత.. -
వాళ్ల జీతాల్లో కోత పెట్టాలి
టీ20లో ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ మండిపడ్డాడు. త్వరగా ఐపీఎల్ను వీడే ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు. -
పారిస్లో అతనొక్కడే..
భారత రెజ్లర్లు సుజీత్ కల్కాల్ (65 కేజీ), జైదీప్ అహ్లావత్ (74 కేజీ)లకు తీవ్ర నిరాశ. పారిస్ ఒలింపిక్స్ బెర్తు సాధించాలన్న వీరి ఆశ తీరలేదు. ప్రపంచ ఒలింపిక్ క్వాలిఫయర్స్ రెపిచేజ్లో సుజీత్ 2-2తో అలెన్ రుథర్ఫర్డ్ (అమెరికా)తో సమానంగా నిలిచాడు. -
కార్ల్సన్కు ప్రజ్ఞానంద షాక్
ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)కు భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరోసారి షాకిచ్చాడు. ఇటీవలి కాలంలో కార్ల్సన్ను తరుచుగా ఓడిస్తున్న ప్రజ్ఞానంద.. శనివారం సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో 69 ఎత్తుల్లో పైచేయి సాధించాడు. -
సత్తాచాటిన ‘లక్ష్య’ అనూష
జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష సత్తాచాటింది. ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మహిళల ట్రిపుల్ జంప్లో ఆమె పసిడి సొంతం చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM