Ravichandran Ashwin: ఇంగ్లాండ్పై అశ్విన్ వికెట్ల ‘సెంచరీ’.. తొలి భారత బౌలర్గా రికార్డ్
Ravichandran Ashwin: టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్.. ఇంగ్లాండ్పై వికెట్ల ‘సెంచరీ’తో అదరగొట్టాడు. టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు+100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు (IND vs ENG Fourth Test)లో స్పిన్ చాణక్యుడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్పై తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్లో అశ్విన్ వేసిన రెండో బంతికి బెయిర్ స్టో ఔటయ్యాడు. దీంతో ఈ జట్టుపై టెస్టుల్లో 100 వికెట్ల మార్క్ (23 మ్యాచ్ల్లో)ను అందుకున్నాడు. అంతేకాదు.. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్ కూడా ఇతడే. జేమ్స్ అండర్సన్ టీమ్ఇండియాపై టెస్టుల్లో 139 వికెట్లు (35 మ్యాచ్ల్లో) తీసి ముందంజలో ఉన్నాడు.
డబుల్ రికార్డ్..
అంతేకాదు.. టెస్టుల్లో ఒక దేశంపై వేయి పరుగులు + 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గానూ అశ్విన్ మరో రికార్డ్ సాధించాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఏడో బౌలర్గా నిలిచాడు. అతడి కంటే ముందు జార్జ్ గిఫెన్, మోనీ నోబెల్, విల్ఫ్రెడ్ రోడ్స్, గార్ఫీల్డ్ సోబెర్స్, ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్ ఈ ఫీట్ సాధించారు.
బీసీసీఐ అల్టిమేటం వేళ.. హార్దిక్తో ఇషాన్ జిమ్ వీడియో వైరల్
కుంబ్లే రికార్డ్కు రెండు వికెట్ల దూరంలో..
మరోవైపు స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో (63 మ్యాచ్ల్లో) ముందున్నాడు. ప్రస్తుతం 349 వికెట్లతో (58 టెస్టుల్లో) ఉన్న అశ్విన్.. మరో రెండు పడగొడితే కుంబ్లేను దాటేస్తాడు.
ఇక టెస్టుల్లో కుంబ్లే 35 సార్లు ‘ఐదు వికెట్ల’ ఘనత అందుకోగా.. అశ్విన్ ఇప్పటి వరకు 34 సార్లు ఆ ఫీట్ను సాధించాడు. తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టులో చెలరేగితే.. ఈ రికార్డులు కూడా తన ఖాతాలో పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటి కుంబ్లే తర్వాత రెండో భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం