IND vs SL: ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చిత్తు.. 23 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమ్ఇండియా (Team India) 50 పరుగులకే ఆలౌట్ చేసి 23 ఏళ్ల తర్వాత లంకపై ప్రతీకారం తీర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023ను టీమ్ఇండియా (Team India) సొంతం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంక (Srilanka)ను చిత్తుగా ఓడించి రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక బ్యాటర్లు.. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. మన బౌలర్ల దెబ్బకు లంక 50 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా వికెట్ నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించింది.
టీమ్ఇండియా ఈ మ్యాచ్లో లంకను 50 పరుగులకే ఆలౌట్ చేసి 23 ఏళ్ల పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ భారత్, శ్రీలంక మధ్య జరిగింది. షార్జా వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 299/5 స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమ్యారు. 54 పరుగులకే ఆలౌటై 245 రన్స్ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓ వన్డే టోర్నీ ఫైనల్లో తక్కువ స్కోరు చేసిన జట్టుగా భారత్ అనవసరపు రికార్డు అందుకుంది. ఇప్పుడు భారత్ అదే శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసి 28 ఏళ్ల తర్వాత ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
మరిన్ని రికార్డులు
- రోహిత్ శర్మ సారథ్యంలో భారత్కిది రెండో ఆసియా కప్. 2018లోనూ (బంగ్లాదేశ్తో ఫైనల్) హిట్మ్యాన్ కెప్టెన్సీలో టీమ్ఇండియా ఆసియా కప్ సాధించింది.
- భారత్కు రెండుసార్లు ఆసియా కప్లు అందించిన మూడో కెప్టెన్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు (అజహరుద్దీన్ 1990, 1995), ధోనీ (2010, 2016) ఈ ఘనత అందుకున్నారు.
- ఆసియా కప్లో అత్యల్ప స్కోరు (50) చేసిన జట్టు శ్రీలంక. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ (87.. 2000లో పాకిస్థాన్పై) పేరిట ఉండేది.
- వన్డేల్లో భారత్పై అత్యల్ప స్కోరు చేసిన జట్టు శ్రీలంక. 2014లో బంగ్లాదేశ్ 58 పరుగులు చేసింది.
- ఈ మ్యాచ్లో భారత్ 263 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బంతులపరంగా టీమ్ఇండియాకిదే అతిపెద్ద విజయం. అంతకన్నా ముందు 2001లో కెన్యాపై 231 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
- ఓ వన్డే టోర్నీ ఫైనల్లో బంతులపరంగా అతిపెద్ద విజయం. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (226 బంతులు ఇంగ్లాండ్పై 2003లో) పేరిట ఉండేది.
- వన్డే టోర్నీ ఫైనల్లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి మాత్రమే. అంతకుముందు భారత్ (జింబాబ్వేపై 1998లో), ఆస్ట్రేలియా (ఇంగ్లాండ్పై 2003లో) ఈ ఘనత సాధించాయి.
- భారత్కి ఇది ఎనిమిదో ఆసియా కప్. శ్రీలంక ఆరుసార్లు విజేతగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ విజయంతో..
దిల్లీ గెలుపుతో లీగ్ దశను ముగించింది. బ్యాటుతో పోరెల్, స్టబ్స్.. బంతితో ఇషాంత్ మెరిసిన వేళ లఖ్నవూను మట్టికరిపించింది. ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న దిల్లీ, సాంకేతికంగా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. -
ద్రవిడ్ స్థానంలో ఎవరు?
టీ20 ప్రపంచకప్తో రాహుల్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో బీసీసీఐ కొత్త ప్రధాన కోచ్ వేటను మొదలెట్టింది. ఇప్పటికే ఆ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ఇప్పుడు ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఆసక్తికర అంశం. -
అగ్రస్థానంలో మను
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బాకర్ అగ్రస్థానం సాధించింది. మంగళవారం ఆఖరిదైన నాలుగో ట్రయల్స్లో ఆమె విజేతగా నిలిచింది. -
ఆ నిబంధన మంచిదే
ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చాలా మంది ఆటగాళ్లు, నిపుణులు విమర్శిస్తుంటే, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం అది మంచిదే అంటున్నాడు. ఆ నిబంధన వల్ల మ్యాచ్లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు. -
ఆ ట్రోఫీని వేలం వేయొద్దు
1986 ఫుట్బాల్ ప్రపంచకప్లో అర్జెంటీనా దిగ్గజం డిగో మారడోనా సాధించిన ‘గోల్డెన్బాల్ ట్రోఫీ’ని వేలం వేయొద్దని అతడి వారసులు కోర్టుకెక్కనున్నారు. -
టాప్సీడ్గా అర్జున్
యువ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో టాప్ సీడింగ్ లభించింది. ఇటీవల వార్సాలో ముగిసిన సూపర్బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నీని అయిదో స్థానంలో ముగించిన అర్జున్.. -
మనిక @ 24
భారత టేబుల్టెన్నిస్ స్టార్ మనిక బత్రా కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. -
ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ మెరిశాడు. పురుషుల 100 మీటర్ల పరుగులో అతడు ఫైనల్కు దూసుకెళ్లాడు. -
సంక్షిప్త వార్తలు
ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో గౌరవ్ చౌహాన్ పతకం ఖాయం చేశాడు. 92 కేజీల పైన విభాగంలో అతడు సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. మంగళవారం క్వార్టర్స్లో గౌరవ్ 3-2తో డానియల్ స్పార్బే (కజకిస్థాన్)ను ఓడించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో