Asian games 2022: ఆసియా క్రీడల్లో భారత్ vs పాక్ తలపడతాయా?
భారత్ -పాకిస్థాన్ (IND vs PAK) మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. దాయాదుల పోరు తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో ఫైనల్కు చేరిన భారత్తో.. చిరకాల ప్రత్యర్థి తలపడే అవకాశం ఉందా..?
ఇంటర్నెట్ డెస్క్: భారత్ -పాకిస్థాన్ (IND vs PAK) మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోయినా.. ఆసియాకప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో అప్పుడప్పుడు భారత్ -పాక్ మధ్య పోరు వీక్షించే అవకాశం అభిమానులకు దక్కుతోంది. అయితే, వన్డే ప్రపంచకప్ కంటే ముందుగానే ఆసియా క్రీడల పుణ్యమా అని మరోసారి చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరిగే అవకాశముంది. అది కూడా ఏకంగా ఫైనల్లో. ఇప్పటికే భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇక పాకిస్థాన్ వంతే మిగిలి ఉంది.
బంగ్లాపై భారత్ ఘన విజయం
ఆసియా క్రీడల్లో తొలిసారి పోటీ పడుతున్న భారత పురుషుల క్రికెట్ జట్టు మెరుగైన ర్యాంకింగ్ ఉండటంతో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్లు ఆడుతోంది. ఇప్పటికే క్వార్టర్స్లో నేపాల్పై విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. అక్కడ బంగ్లాదేశ్తో తలపడింది. అలవోకగా చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 96/9 స్కోరుకే పరిమితం కాగా.. టీమ్ఇండియా కేవలం ఒక్క వికెట్ను మాత్రమే నష్టపోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది.
ఫైనల్కు పాక్ రావాలంటే..?
ప్రస్తుతం ఫైనల్ బెర్తు కోసం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్లో తనకంటే మెరుగైన శ్రీలంక జట్టును అఫ్గానిస్థాన్ ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి సెమీస్కు వచ్చింది. ఒకవేళ సెమీస్లోనూ అఫ్గాన్ సర్వశక్తులు ఒడ్డి పాకిస్థాన్కు షాకిస్తే సంచలనమవుతుంది. అలా జరిగితే భారత్, పాక్ ఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయి. అందుకే రెండో సెమీస్లో అఫ్గాన్పై పాకిస్థాన్ విజయం సాధించి ఫైనల్కు చేరితే.. వరల్డ్ కప్ ముందు కంటే మరోసారి దాయాదుల పోరును వీక్షించే అవకాశం క్రికెట్ అభిమానులకు లభిస్తుంది.
భారత్, పాక్ మధ్య ఫైనల్ ఉంటే?
ఒకవేళ సమీకరణాలు కలిసొచ్చి దాయాదులు టైటిల్ పోరులో తలపడితే టీమ్ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన జట్టులో యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె వంటి హిట్టర్లు ఉన్నారు. పైగా వీరంతా ఐపీఎల్లో దంచికొట్టారు. క్వార్టర్ ఫైనల్లో యశస్వి సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కానీ, పాక్తో పోలిస్తే భారత్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. హంకాంగ్తో జరిగిన క్వార్టర్స్లో పాక్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో ఆ జట్టు బౌలర్ల పాత్ర కీలకం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో పాక్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ 92పరుగులకే కుప్పకూలింది.
నేపాల్తో మ్యాచ్లో భారత బౌలర్లు తొమ్మిది వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పేసర్లు అర్ష్దీప్ (4/43), అవేశ్ ఖాన్ (3/32) పరుగులు ఇవ్వగా.. స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం (3/24) పొదుపుగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ మెరుగుపడితే పాక్ను ఓడించడం భారత్కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఫైనల్లో గెలిచే జట్టుకు స్వర్ణం, ఓడిన జట్టుకు రజత పతకాలు దక్కుతాయి. సెమీ ఫైనల్స్లో ఓడిన జట్లు కాంస్య పతకం కోసం మరో మ్యచ్లో తలపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?