Asian games 2022: ఆసియా క్రీడల్లో భారత్ vs పాక్ తలపడతాయా?
భారత్ -పాకిస్థాన్ (IND vs PAK) మధ్య క్రికెట్ మ్యాచ్ అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. దాయాదుల పోరు తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తారు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో ఫైనల్కు చేరిన భారత్తో.. చిరకాల ప్రత్యర్థి తలపడే అవకాశం ఉందా..?
ఇంటర్నెట్ డెస్క్: భారత్ -పాకిస్థాన్ (IND vs PAK) మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తుంటారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోయినా.. ఆసియాకప్, ప్రపంచకప్ వంటి టోర్నీల్లో అప్పుడప్పుడు భారత్ -పాక్ మధ్య పోరు వీక్షించే అవకాశం అభిమానులకు దక్కుతోంది. అయితే, వన్డే ప్రపంచకప్ కంటే ముందుగానే ఆసియా క్రీడల పుణ్యమా అని మరోసారి చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ జరిగే అవకాశముంది. అది కూడా ఏకంగా ఫైనల్లో. ఇప్పటికే భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇక పాకిస్థాన్ వంతే మిగిలి ఉంది.
బంగ్లాపై భారత్ ఘన విజయం
ఆసియా క్రీడల్లో తొలిసారి పోటీ పడుతున్న భారత పురుషుల క్రికెట్ జట్టు మెరుగైన ర్యాంకింగ్ ఉండటంతో నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్లు ఆడుతోంది. ఇప్పటికే క్వార్టర్స్లో నేపాల్పై విజయం సాధించి సెమీస్కు దూసుకెళ్లింది. అక్కడ బంగ్లాదేశ్తో తలపడింది. అలవోకగా చిత్తు చేసి ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 96/9 స్కోరుకే పరిమితం కాగా.. టీమ్ఇండియా కేవలం ఒక్క వికెట్ను మాత్రమే నష్టపోయి 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది.
ఫైనల్కు పాక్ రావాలంటే..?
ప్రస్తుతం ఫైనల్ బెర్తు కోసం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్లో తనకంటే మెరుగైన శ్రీలంక జట్టును అఫ్గానిస్థాన్ ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి సెమీస్కు వచ్చింది. ఒకవేళ సెమీస్లోనూ అఫ్గాన్ సర్వశక్తులు ఒడ్డి పాకిస్థాన్కు షాకిస్తే సంచలనమవుతుంది. అలా జరిగితే భారత్, పాక్ ఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయి. అందుకే రెండో సెమీస్లో అఫ్గాన్పై పాకిస్థాన్ విజయం సాధించి ఫైనల్కు చేరితే.. వరల్డ్ కప్ ముందు కంటే మరోసారి దాయాదుల పోరును వీక్షించే అవకాశం క్రికెట్ అభిమానులకు లభిస్తుంది.
భారత్, పాక్ మధ్య ఫైనల్ ఉంటే?
ఒకవేళ సమీకరణాలు కలిసొచ్చి దాయాదులు టైటిల్ పోరులో తలపడితే టీమ్ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన జట్టులో యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె వంటి హిట్టర్లు ఉన్నారు. పైగా వీరంతా ఐపీఎల్లో దంచికొట్టారు. క్వార్టర్ ఫైనల్లో యశస్వి సెంచరీ బాదిన విషయం తెలిసిందే. కానీ, పాక్తో పోలిస్తే భారత్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. హంకాంగ్తో జరిగిన క్వార్టర్స్లో పాక్ 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో ఆ జట్టు బౌలర్ల పాత్ర కీలకం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో పాక్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ 92పరుగులకే కుప్పకూలింది.
నేపాల్తో మ్యాచ్లో భారత బౌలర్లు తొమ్మిది వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పేసర్లు అర్ష్దీప్ (4/43), అవేశ్ ఖాన్ (3/32) పరుగులు ఇవ్వగా.. స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రం (3/24) పొదుపుగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ మెరుగుపడితే పాక్ను ఓడించడం భారత్కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఫైనల్లో గెలిచే జట్టుకు స్వర్ణం, ఓడిన జట్టుకు రజత పతకాలు దక్కుతాయి. సెమీ ఫైనల్స్లో ఓడిన జట్లు కాంస్య పతకం కోసం మరో మ్యచ్లో తలపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు