Erriyon Knighton: దిగింది మరో చిరుత
ఇప్పటితరం క్రీడాభిమానులకు రన్నింగ్ ట్రాక్లో ఉసేన్ బోల్ట్ పేరు సుపరిచితం. తాజాగా మరో పరుగుల వీరుడు దూసుకొచ్చాడు. బోల్ట్ను మైమరిపించేలా ట్రాక్లో అతడు దూసుకుపోతూ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
స్ప్రింట్ అనగానే గుర్తుకొచ్చే పేరు ఉసేన్ బోల్ట్ (Usain Bolt)! చిరుత వేగంతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడీ జమైకా స్టార్. ఇప్పుడు బోల్ట్ బాటలోనే మరో స్ప్రింటర్ ట్రాక్లో దుమ్ము రేపుతున్నాడు. తన ఆరాధ్యం బోల్ట్ రికార్డునే బద్దలుకొట్టి ఔరా అనిపించాడు. అతడే ఎరియన్ నైటాన్ (Erriyon Knighton). ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈ అమెరికా స్ప్రింటర్పైనే అందరి దృష్టి నిలిచింది.
ఫ్లోరిడాకు చెందిన నైటాన్ను చూస్తే ఏ ఎన్బీఏ ఆటగాడో అనిపిస్తాడు. అంత పొడగరి అతడు. బోల్ట్ మాదిరే పొడుగ్గా.. సన్నగా ఉండే ఈ కుర్రాడు.. ట్రాక్లో పరుగు తీస్తుంటే మిగిలిన వాళ్లు అతడి వెనుకే! నిజానికి నైటాన్ చిన్నప్పటి నుంచి రన్నర్ కాదు. ఫుట్బాల్ ఆటగాడు! ఈ ఆటలో చాలాకాలం కొనసాగిన నైటాన్.. తనలో ఉన్న మెరుపు వేగాన్ని ఆలస్యంగా గుర్తించాడు. లేటుగా ట్రాక్లోకి వచ్చినా ప్రస్తుత స్ప్రింట్ స్టార్లు నోవా లేల్స్ లాంటి వాళ్లకు కంగారు పుట్టిస్తున్నాడు.
ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ఫుట్బాల్ బాస్పై స్పెయిన్ పీఎం ఆగ్రహం
ఫ్లోరిడా యూనివర్సిటీ కోచ్ మైక్ హోలోవె శిక్షణలో రాటుదేలిన ఈ కుర్రాడు.. 200 మీటర్ల పరుగులో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. 2020లో జూనియర్ ఒలింపిక్ క్రీడల్లో 200 మీటర్ల పరుగును 20.33 సెకన్లలో పూర్తి చేసి 15-16 వయసు విభాగంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. జూనియర్ స్థాయిలో తన ముద్ర వేసిన ఈ కుర్రాడు.. గతేడాది యూజీన్లో జరిగిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్లో మరో సంచలనం సృష్టించాడు.
200 మీటర్ల పరుగును 19.49 సెకన్లలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ పేరిట 18 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 200 మీటర్ల పరుగును 20 సెకన్లలోపు పరుగెత్తిన తొలి అమెరికా అథ్లెట్గానూ అతడు ఘనత సాధించాడు. గత రెండేళ్లుగా డైమండ్ లీగ్లో 200 పరుగులో అతడికి ఎదురే లేదు. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లోనూ నైటాన్దే పైచేయి. ఈ వరుస విజయాలతోనే అతడు రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ ‘రైజింగ్ స్టార్’ అవార్డును దక్కించుకున్నాడు.
100 మీటర్ల పరుగులోనూ నైటాన్ సత్తా చాటుతున్నా అతడి ప్రధాన దృష్టి 200 మీ. మీదే కేంద్రీకరించాడు. అండర్-20 కేటగిరిలో 200 మీటర్ల పరుగులో పదకొండుసార్లు తన రికార్డును తానే సవరించడం నైటాన్ సత్తాకు నిదర్శనం. అందుకే ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 200 మీటర్ల పరుగులో ఈ కుర్రాడు ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. గతేడాది 19.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మైకేల్ జాన్సన్ రికార్డును బద్దలు కొట్టిన నోవా లేల్స్కు ఈసారి నైటాన్తో పోటీపడి గెలవడం కష్టమే. ట్రాక్ మీదే కాదు రోడ్డు మీదా దూసుకెళ్లడం నైటాన్కు సరదా. స్పోర్ట్స్ కారుల్లో షికారు కొడుతూ ట్రాక్ సెంటర్లకు వెళుతుంటాడీ అమెరికా టీనేజర్. ఏదో ఒకరోజు మెక్లారెన్, లాంబోర్గిని కార్లు కొనాలనేది ఇతడి ఆశ. అంతేకాదు ఒకటి కాదు రెండు ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గాలనేది నైటాన్ లక్ష్యం. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గి 2024 పారిస్ ఒలింపిక్స్కు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనే ధ్యేయంతో ఉన్నాడు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు