Erriyon Knighton: దిగింది మరో చిరుత
ఇప్పటితరం క్రీడాభిమానులకు రన్నింగ్ ట్రాక్లో ఉసేన్ బోల్ట్ పేరు సుపరిచితం. తాజాగా మరో పరుగుల వీరుడు దూసుకొచ్చాడు. బోల్ట్ను మైమరిపించేలా ట్రాక్లో అతడు దూసుకుపోతూ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
స్ప్రింట్ అనగానే గుర్తుకొచ్చే పేరు ఉసేన్ బోల్ట్ (Usain Bolt)! చిరుత వేగంతో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడీ జమైకా స్టార్. ఇప్పుడు బోల్ట్ బాటలోనే మరో స్ప్రింటర్ ట్రాక్లో దుమ్ము రేపుతున్నాడు. తన ఆరాధ్యం బోల్ట్ రికార్డునే బద్దలుకొట్టి ఔరా అనిపించాడు. అతడే ఎరియన్ నైటాన్ (Erriyon Knighton). ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈ అమెరికా స్ప్రింటర్పైనే అందరి దృష్టి నిలిచింది.
ఫ్లోరిడాకు చెందిన నైటాన్ను చూస్తే ఏ ఎన్బీఏ ఆటగాడో అనిపిస్తాడు. అంత పొడగరి అతడు. బోల్ట్ మాదిరే పొడుగ్గా.. సన్నగా ఉండే ఈ కుర్రాడు.. ట్రాక్లో పరుగు తీస్తుంటే మిగిలిన వాళ్లు అతడి వెనుకే! నిజానికి నైటాన్ చిన్నప్పటి నుంచి రన్నర్ కాదు. ఫుట్బాల్ ఆటగాడు! ఈ ఆటలో చాలాకాలం కొనసాగిన నైటాన్.. తనలో ఉన్న మెరుపు వేగాన్ని ఆలస్యంగా గుర్తించాడు. లేటుగా ట్రాక్లోకి వచ్చినా ప్రస్తుత స్ప్రింట్ స్టార్లు నోవా లేల్స్ లాంటి వాళ్లకు కంగారు పుట్టిస్తున్నాడు.
ముద్దు వివాదం.. ఆ క్షమాపణలు సరిపోవంటూ ఫుట్బాల్ బాస్పై స్పెయిన్ పీఎం ఆగ్రహం
ఫ్లోరిడా యూనివర్సిటీ కోచ్ మైక్ హోలోవె శిక్షణలో రాటుదేలిన ఈ కుర్రాడు.. 200 మీటర్ల పరుగులో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. 2020లో జూనియర్ ఒలింపిక్ క్రీడల్లో 200 మీటర్ల పరుగును 20.33 సెకన్లలో పూర్తి చేసి 15-16 వయసు విభాగంలో కొత్త రికార్డు నెలకొల్పాడు. జూనియర్ స్థాయిలో తన ముద్ర వేసిన ఈ కుర్రాడు.. గతేడాది యూజీన్లో జరిగిన ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్లో మరో సంచలనం సృష్టించాడు.
200 మీటర్ల పరుగును 19.49 సెకన్లలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ పేరిట 18 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 200 మీటర్ల పరుగును 20 సెకన్లలోపు పరుగెత్తిన తొలి అమెరికా అథ్లెట్గానూ అతడు ఘనత సాధించాడు. గత రెండేళ్లుగా డైమండ్ లీగ్లో 200 పరుగులో అతడికి ఎదురే లేదు. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లోనూ నైటాన్దే పైచేయి. ఈ వరుస విజయాలతోనే అతడు రెండుసార్లు ప్రపంచ అథ్లెటిక్స్ ‘రైజింగ్ స్టార్’ అవార్డును దక్కించుకున్నాడు.
100 మీటర్ల పరుగులోనూ నైటాన్ సత్తా చాటుతున్నా అతడి ప్రధాన దృష్టి 200 మీ. మీదే కేంద్రీకరించాడు. అండర్-20 కేటగిరిలో 200 మీటర్ల పరుగులో పదకొండుసార్లు తన రికార్డును తానే సవరించడం నైటాన్ సత్తాకు నిదర్శనం. అందుకే ప్రస్తుతం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 200 మీటర్ల పరుగులో ఈ కుర్రాడు ఫేవరెట్గా బరిలో దిగుతున్నాడు. గతేడాది 19.31 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మైకేల్ జాన్సన్ రికార్డును బద్దలు కొట్టిన నోవా లేల్స్కు ఈసారి నైటాన్తో పోటీపడి గెలవడం కష్టమే. ట్రాక్ మీదే కాదు రోడ్డు మీదా దూసుకెళ్లడం నైటాన్కు సరదా. స్పోర్ట్స్ కారుల్లో షికారు కొడుతూ ట్రాక్ సెంటర్లకు వెళుతుంటాడీ అమెరికా టీనేజర్. ఏదో ఒకరోజు మెక్లారెన్, లాంబోర్గిని కార్లు కొనాలనేది ఇతడి ఆశ. అంతేకాదు ఒకటి కాదు రెండు ఒలింపిక్స్ స్వర్ణాలు నెగ్గాలనేది నైటాన్ లక్ష్యం. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గి 2024 పారిస్ ఒలింపిక్స్కు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనే ధ్యేయంతో ఉన్నాడు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన