BCCI: అలాంటి ప్రకటనలపై తస్మాత్ జాగ్రత్త.. NCA అందరికీ కాదు: బీసీసీఐ హెచ్చరిక
దేశవాళీ క్రికెటర్లు, అభిమానులు ఎవరూ మోసపూరిత ప్రకటనల ఉచ్చులో పడొద్దని బీసీసీఐ హెచ్చరించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ క్రికెట్ అకాడమీలో (NCA) అడ్మిషన్లు ఇప్పిస్తామని చేసే ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని బీసీసీఐ స్పష్టం చేసింది. అక్రమార్జన కోసం కొందరు ఇలాంటి తప్పుడు మార్గాలకు వెళ్తున్నారని పేర్కొంది. బెంగళూరులోని ఎన్సీఏలోకి ప్రవేశం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.
‘‘ఎన్సీఏలోకి ప్రవేశం ఇప్పిస్తామని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అక్కడి సదుపాయాలను వినియోగించుకునేందుకు క్రికెటర్ల నుంచి మేం ఎలాంటి సొమ్ము వసూలు చేయం. అందుకు సంబంధించిన ప్రోటోకాల్స్ను ఇప్పటికే అమలుచేస్తున్నాం. ఎన్సీఏలో అందరికీ ప్రవేశం ఉండదు. బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు క్రికెటర్లకు ఎన్సీఏలో అవకాశం కల్పిస్తాం. అంతేకానీ, ఇతర ఏజెన్సీల ద్వారా ఏమాత్రం అవకాశం ఉండదు. క్రికెటర్లు, కోచ్లు, అభిమానులు ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు. ఎలాంటి సూచనలు కావాలన్నా రాష్ట్ర క్రికెట్ సంఘాలను సంప్రదించాలి’’ అని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ చెప్పినా.. రంజీల్లో ఆడని ఇషాన్
జాతీయ జట్టుకు ఎంపిక కాని.. ఫిట్గా ఉన్న ప్రతీ క్రికెటర్ దేశవాళీలో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ తేల్చి చెప్పింది. అయితే, ఇషాన్ కిషన్ మాత్రం రంజీల్లో ఆడకుండా ఉండిపోయాడు. దీంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అతడు ఆడకపోవడానికి కారణాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. ‘‘సాంకేతికపరమైన అంశాలపై ఇషాన్ దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడు రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడి ఫామ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది’’ అని బీసీసీఐ అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!