BCCI: అలాంటి ప్రకటనలపై తస్మాత్ జాగ్రత్త.. NCA అందరికీ కాదు: బీసీసీఐ హెచ్చరిక
దేశవాళీ క్రికెటర్లు, అభిమానులు ఎవరూ మోసపూరిత ప్రకటనల ఉచ్చులో పడొద్దని బీసీసీఐ హెచ్చరించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ క్రికెట్ అకాడమీలో (NCA) అడ్మిషన్లు ఇప్పిస్తామని చేసే ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని బీసీసీఐ స్పష్టం చేసింది. అక్రమార్జన కోసం కొందరు ఇలాంటి తప్పుడు మార్గాలకు వెళ్తున్నారని పేర్కొంది. బెంగళూరులోని ఎన్సీఏలోకి ప్రవేశం మెరిట్ ఆధారంగానే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన జారీ చేసింది.
‘‘ఎన్సీఏలోకి ప్రవేశం ఇప్పిస్తామని మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అక్కడి సదుపాయాలను వినియోగించుకునేందుకు క్రికెటర్ల నుంచి మేం ఎలాంటి సొమ్ము వసూలు చేయం. అందుకు సంబంధించిన ప్రోటోకాల్స్ను ఇప్పటికే అమలుచేస్తున్నాం. ఎన్సీఏలో అందరికీ ప్రవేశం ఉండదు. బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్లు, రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు క్రికెటర్లకు ఎన్సీఏలో అవకాశం కల్పిస్తాం. అంతేకానీ, ఇతర ఏజెన్సీల ద్వారా ఏమాత్రం అవకాశం ఉండదు. క్రికెటర్లు, కోచ్లు, అభిమానులు ఎవరైనా ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు. ఎలాంటి సూచనలు కావాలన్నా రాష్ట్ర క్రికెట్ సంఘాలను సంప్రదించాలి’’ అని బీసీసీఐ తెలిపింది.
బీసీసీఐ చెప్పినా.. రంజీల్లో ఆడని ఇషాన్
జాతీయ జట్టుకు ఎంపిక కాని.. ఫిట్గా ఉన్న ప్రతీ క్రికెటర్ దేశవాళీలో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ తేల్చి చెప్పింది. అయితే, ఇషాన్ కిషన్ మాత్రం రంజీల్లో ఆడకుండా ఉండిపోయాడు. దీంతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, అతడు ఆడకపోవడానికి కారణాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. ‘‘సాంకేతికపరమైన అంశాలపై ఇషాన్ దృష్టిపెట్టాడు. ప్రస్తుతం అతడు రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా లేడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో ఆడి ఫామ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది’’ అని బీసీసీఐ అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత