ODI WC 2023: ఉప్పల్ మ్యాచ్ను రీ షెడ్యూల్ చేస్తారా.? స్పందించిన బీసీసీఐ!
వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ (ODI World Cup 2023) రీషెడ్యూల్పై హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA), హైదరాబాద్ పోలీస్ విభాగం చేసిన విజ్ఞప్తిపై బీసీసీఐ స్పందించింది. అయితే, నిర్ణయం మాత్రం సానుకూలంగా రావడం కష్టమేనన్నట్లుగా తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు రోజుల్లో మ్యాచ్లను నిర్వహిస్తే సెక్యూరిటీపరంగా ఇబ్బందులు వస్తాయని హైదరాబాద్ పోలీసుల ఆందోళనను బీసీసీఐ దృష్టికి హెచ్సీఏ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుండగా.. పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ ఆ మరుసటి రోజునే (అక్టోబర్ 10న) ఉంది. దీంతో భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని హైదరాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) కూడా బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాత్రం షెడ్యూలింగ్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. గత జూన్లో తొలి షెడ్యూల్ను ప్రకటించిన ఐసీసీ, బీసీసీఐ.. ఆ తర్వాత వివిధ దేశాలు, రాష్ట్ర క్రికెట్ సంఘాల విజ్ఞప్తుల మేరకు తొమ్మిది మ్యాచ్లను రీషెడ్యూల్ చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి హెచ్సీఏ విజ్ఞప్తి చేసినా రీషెడ్యూల్కు అవకాశం ఉండటం కష్టమేనని రాజీవ్ శుక్లా వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది.
రుతురాజ్ క్లాస్.. రింకు సింగ్ ఊరమాస్.. వీడియోలు అదుర్స్
‘‘వరల్డ్ కప్ (ODI World Cup 2023) మ్యాచ్లు జరగనున్న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) ఇన్ఛార్జ్గా ఉన్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే, వరల్డ్ కప్ మ్యాచ్ షెడ్యూల్ను మార్చడం అంత తేలిక కాదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్ను మార్చలేదు. మిగతా జట్లు, ఐసీసీ. క్రికెట్ సంఘాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే హైదరాబాద్ పోలీస్, క్రికెట్ సంఘం ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ వేదికగానే పాకిస్థాన్ రెండు మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్తో, అక్టోబర్ 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్ మ్యాచ్లను కూడా ఉప్పల్లోనే పాక్ ఆడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్