Gujarat vs Bengaluru: జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అహ్మదాబాద్: బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్ (100*; 41 బంతుల్లో 5×4, 10×6), కోహ్లీ (70*, 44 బంతుల్లో 6×4, 3×6) చెలరేగారు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. బంతి పడితే చాలు.. బౌండరీ అన్నట్లుగా ఆడారు. వీరి బాదుడుకు 201 పరుగుల భారీ లక్ష్యం కూడా చిన్నబోయింది. డుప్లెసిస్ (24; 12 బంతుల్లో 1×4, 3×6) మెరిపించాడు. గుజరాత్ బౌలర్లలో రవి శ్రీనివాసన్ ఒక వికెట్ రాబట్టుకున్నాడు.
31 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 10 బంతుల్లో మరో 50
31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన విల్ జాక్స్.. మరో 10 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇది చాలు అతడి విధ్వంసం ఎలా సాగిందో చెప్పడానికి. వీల్ జాక్స్ ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. మోహిత్ శర్మ వేసిన 11 ఓవర్ నుంచి దూకుడు మొదలెట్టాడు. ఆ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్ రాబట్టిన అతడు.. సాయి కిశోర్, నూర్ అహ్మద్ బౌలింగ్లో ఒక్కో సిక్స్ కొట్టాడు. మోహిత్ శర్మ వేసిన 15 ఓవర్లో జాక్స్ మొదటి రెండు బంతులకు ఫోర్, సిక్స్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇదే ఓవర్లో రెండు సిక్స్లు, ఓ ఫోర్ బాదేశాడు. ఇక రషీద్ ఖాన్ వేసిన 16 ఓవర్లో విల్ జాక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా 6, 6, 4, 6, 6 దంచేసి సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటు బెంగళూరుకు భారీ విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (5), శుభ్మన్ గిల్ (16) నిరాశపరిచినప్పటికీ.. ఫస్ట్ డౌన్లో వచ్చిన సాయి సుదర్శన్ (84*; 49 బంతుల్లో 8×4, 4×6) చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అగ్నికి వాయువు తోడైనట్లు రెండో డౌన్లో వచ్చిన షారూఖ్ ఖాన్ (58; 30 బంతుల్లో 3×4, 5×6) మరింత విజృంభించాడు.
ఇద్దరూ కలిసి బెంగళూరును ఎడాపెడా బాదేశారు. భయంకరంగా మారిన ఈ జోడీని సిరాజ్ విడగొట్టాడు. 14.1వ బంతికి షారూఖ్ బౌల్డయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (26*, 19 బంతుల్లో 2×4, 1×6) కూడా ఏమాత్రం తగ్గలేదు. దీంతో గుజరాత్ భారీ స్కోరే చేసింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, సిరాజ్, మాక్స్వెల్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంతగడ్డపై మురిసిన చెన్నై.. రాజస్థాన్పై ఘన విజయం
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
అభిమానులారా.. మ్యాచ్ ముగిశాక వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై తమ సొంతమైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడుతోంది. ధోనీని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే దిల్లీ, బెంగళూరుకు ఈ విజయం కీలకమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ మ్యాచ్ జరగనుంది. -
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండటానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. నాణ్యమైన ఇన్నింగ్స్లతో ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
ప్లేఆఫ్స్ కోసం తీవ్రంగా పోరాడుతున్న దిల్లీ జట్టుకు ఐపీఎల్ కమిటీ షాక్ ఇచ్చింది. ఆ జట్టు సారథిపై ఒక మ్యాచ్ వేటు వేసింది. -
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో డిన్నర్ డేట్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి. -
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
మూడు ‘ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఐదు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. అందులో ఇవాళ నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. -
ముంబయిపై ‘తొలిసారి’ రికార్డు విజయాలు సాధించిన కోల్కతా
ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరిన మొదటి టీమ్గా కోల్కతా అర్హత సాధించింది. ముంబయిని చిత్తు చేసిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. -
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
సొంతగడ్డపై మురిసిన చెన్నై.. రాజస్థాన్పై ఘన విజయం
-
రెంటచింతలలో వైకాపా నేతల దాడి.. పలువురికి గాయాలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా