WPL 2024 - RCB: డబ్ల్యూపీఎల్‌ విజేతగా ఆర్సీబీ.. పురుషుల జట్టుపై నెట్టింట మీమ్స్!

ఆర్సీబీ మహిళా జట్టు విజేతగా నిలవడంతో పురుష టీమ్‌పై సోషల్‌ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయి. డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌ ఛాంపియన్‌గా ఆర్సీబీ నిలిచింది.

Updated : 18 Mar 2024 13:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) రెండో సీజన్‌ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. స్మృతి మంధాన నాయకత్వంలో దిల్లీని ఓడించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అదే సమయంలో ఆర్సీబీ పురుషుల జట్టును ఉద్దేశించి చేసిన మీమ్స్‌, పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇప్పటి వరకు 16 ఐపీఎల్‌ సీజన్లలో స్టార్‌ క్రికెటర్లతో బరిలోకి దిగినప్పటికీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. క్రిస్‌ గేల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, ఫాఫ్‌ డుప్లెసిస్‌ తదితరులు ఆడారు. ఇప్పుడీ డబ్ల్యూపీఎల్‌ను మహిళా జట్టు సొంతం చేసుకోవడంతో.. క్రికెట్‌ ఫ్యాన్స్‌ క్రియేట్‌ చేసిన మీమ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఆర్సీబీ విజయంపై రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా కామెడీ హిందీ సీరియల్‌లోని పాత్రధారి ‘జెఠ్‌లాల్‌’తో చేసిన మీమ్‌ను పోస్టు చేసింది. దానికి ఆర్సీబీ సరదాగా స్పందించింది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని