Mumbai X Chennai: రోహిత్ శతకం వృథా.. ముంబయిని సొంత మైదానంలో ఓడించిన చెన్నై
ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్పై కన్నెసిన ముంబయికి చెన్నై షాక్ ఇచ్చింది. ముంబయి సొంతమైదానంలో 20 పరుగుల తేడాతో ఓడించింది.
ముంబయి: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన ముంబయికి చెన్నై షాక్ ఇచ్చింది. వాంఖడే వేదికగా జరిగిన పోరులో ముంబయిని చెన్నై 20 పరుగుల తేడాతో ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (105*; 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్లు) శతకంతో చెలరేగినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. తిలక్ వర్మ (31; 20 బంతుల్లో 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (23; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (13; 5 బంతుల్లో 2 సిక్స్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్య (2), రొమారియో షెఫర్డ్ (1) ఘోరంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో పతిరన నాలుగు వికెట్లు పడగొట్టి ముంబయిని దెబ్బతీశాడు. తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అజింక్య రహానె (5), రచిన్ రవీంద్ర (21) తక్కువ నిరాశపర్చినా.. రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లు), శివమ్ దూబె (66*; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలు బాదారు. చివర్లో ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో) హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య 2, శ్రేయస్ గోపాల్, కొయెట్జీ ఒక్కో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ