Shardul Thakur: ఒకే ఒక్క వీక్ లింక్.. ఆందోళన రేకెత్తిస్తున్న శార్దూల్ ఫామ్!
వరల్డ్ కప్ కోసం (ODI World Cup 2023) బరిలోకి దిగిన భారత జట్టులో యువకులతోపాటు సీనియర్లకూ చోటు దక్కింది. అయితే, శార్దూల్ ఠాకూర్ విషయంలోనే మేనేజ్మెంట్తోపాటు క్రికెట్ అభిమానులకు ఆందోళన కలుగుతోంది.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ముంగిట టీమ్ఇండియా సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అయిపోతూ వచ్చాయి. జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్, ఫామ్ను చాటుకున్నారు. గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్లో చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయాయి. కానీ ఒక్క శార్దూల్ ఠాకూర్ ఫామ్ మాత్రం ఆందోళన రేకెత్తిస్తోంది. కీలక మ్యాచ్ల్లో అతనెక్కడ టీమ్ఇండియా (Team India) కొంప ముంచుతాడో అని అభిమానులు కంగారు పడుతున్నారు.
మూడు వారాల కిందట వన్డే ప్రపంచకప్నకు భారత జట్టును ప్రకటించిన సమయంలో సెలక్టర్లు సరైన నిర్ణయాలే తీసుకున్నారా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే అప్పటికి కొందరు ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్ మీద సందేహాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గాయాల కారణంగా కొన్ని నెలల పాటు మైదానానికి దూరమై.. అప్పుడే జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల ఎంపికపై చాలా చర్చ జరిగింది. అయితే రాహుల్ ఆసియా కప్లో సత్తా చాటుకున్నాడు. పాకిస్థాన్పై అద్భుత శతకంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత కూడా నిలకడను కొనసాగించాడు. శ్రేయస్ కొంచెం ఆలస్యంగా.. ఆస్ట్రేలియాతో సిరీస్లో గాడిన పడ్డాడు. ఆ జట్టుపై శతకం సాధించాడు.
Rohit Sharma: సిక్సర్లందు రోహిత్ సిక్సర్లు వేరయా!
మరోవైపు వన్డేల్లో తనేంటో నిరూపించుకోలేక ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ సైతం ఇదే సిరీస్లో వరుసగా రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నాడు. ఇంకోవైపు బౌలింగ్లో బుమ్రా, సిరాజ్, షమి, కుల్దీప్ నిలకడగా రాణిస్తుండటం కూడా జట్టుకు ఆనందాన్నిచ్చింది. అక్షర్ పటేల్ ఎంపిక మీద ప్రశ్నలు తలెత్తగా అతను ఆసియా కప్లో గాయపడ్డాడు. ఆ తర్వాత ప్రపంచకప్ జట్టుకూ దూరమయ్యాడు. అతడి స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు. అతను ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో చక్కటి ప్రదర్శన చేశాడు. అశ్విన్ రాకతో బౌలింగ్లోనూ వైవిధ్యం వచ్చింది.
అదే భయం
జట్టులో మిగతా ఆటగాళ్లందరూ ప్రపంచకప్ ఆడటానికి వంద శాతం అర్హులు. దాదాపుగా అందరూ మంచి లయతో ఉన్నారు. కానీ ఒక్క శార్దూల్ ఠాకూర్ మాత్రమే జట్టులో వీక్ లింక్ లాగా కనిపిస్తున్నాడు. ప్రపంచకప్ సంగతి అటుంచితే.. శార్దూల్ ఫామ్ చూస్తే అతను మామూలుగా కూడా వన్డే జట్టులో ఉండటానికి అర్హుడేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటిదాకా 44 వన్డేలాడిన అతను.. 30.34 సగటుతో 63 వికెట్లే తీశాడు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే శార్దూల్ ప్రదర్శన సాధారణం. ఇటీవల ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లో అతణ్ని ఆడిస్తే.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. తొలి మ్యాచ్లో బౌలర్లకు అనుకూలించిన పిచ్పై 10 ఓవర్లలో 78 పరుగులు సమర్పించుకున్న అతను.. రెండో మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులు ఇచ్చుకున్నాడు. గతంలో, అది కూడా కొన్ని టెస్టు మ్యాచ్ల్లో ఆల్రౌండ్ మెరుపులతో ఆకట్టుకున్నాడు శార్దూల్. అతడికి వికెట్ టేకింగ్ బౌలర్గా పేరుంది. లోయరార్డర్లో అప్పుడప్పుడూ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తాడు. కానీ శార్దూల్ నిలకడగా రాణించిన దాఖలాలు తక్కువ. ఇటీవల బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ విఫలమవుతున్నాడు.
శార్దూల్తో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. అతను ధారాళంగా పరుగులు ఇచ్చేస్తాడు. బౌలింగ్ అనుకూల పరిస్థితుల్లో కూడా ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకునేది అతణ్నే. శార్దూల్ వస్తే ప్రత్యర్థులకు పండగే అన్నట్లు తయారవుతోంది పరిస్థితి. అప్పుడప్పుడూ వికెట్లు తీస్తాడని.. బ్యాటింగ్లో ఉపయోగపడతాడని చూస్తే.. ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో బాగా పరుగులిచ్చి జట్టు కొంప ముంచుతాడనే భయం పెరుగుతోంది. శార్దూల్తో పోలిస్తే ప్రసిద్ధ్ కృష్ణ ఎంతో మెరుగని ఇటీవల ఆసీస్ సిరీస్లో తన బౌలింగ్ చూస్తే అర్థమైంది. అక్షర్ బదులు అశ్విన్ వచ్చినట్లు.. ప్రపంచకప్ మొదలయ్యేలోపు శార్దూల్ స్థానంలోకి ప్రసిద్ధ్ వస్తే జట్టుకు మంచిదనే అభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్