David Warner: చివరి టెస్టులో హాఫ్ సెంచరీ.. అభిమానుల్లో చిరునవ్వులు నింపానని భావిస్తున్నా: వార్నర్
డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. హాఫ్ సెంచరీ సాధించి ఘనమైన వీడ్కోలు పలికాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్తో (AUS vs PAK) జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (57) సాధించి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్ను ఆసీస్ క్లీన్స్వీప్ చేసింది. వీడ్కోలు టెస్టు సందర్భంగా వార్నర్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఆసీస్, పాకిస్థాన్ ఆటగాళ్లు అతడికి అభినందనలు తెలిపారు.
‘‘కెరీర్లో చివరి టెస్టు సిరీస్ను 3-0 తేడాతో కైవసం చేసుకోవడం అద్భుతంగా ఉంది. ఏడాదిన్నర నుంచి ఆసీస్ క్రికెట్కు అంతా మంచే జరుగుతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా నిలవడం, యాషెస్ సిరీస్ను డ్రా చేయడం, వన్డే ప్రపంచకప్ను సాధించడం.. ఇలా అన్ని మెగా ఈవెంట్లలో భాగమయ్యా. ఇప్పుడు పాక్తో మూడు టెస్టుల సిరీస్ దక్కింది. ఇలాంటి జట్టుతో ప్రయాణం సాగించడం గర్వంగా ఉంది. మైదానంలోనే కాకుండా.. వెలుపలా జట్టు సభ్యులు శ్రమించే తీరు అభినందనీయం. ఇవాళ మైదానంలోకి అడుగు పెట్టే ముందు టెస్టుల్లో నా చివరి రోజు అని భావించలేదు. సొంత ప్రేక్షకుల మధ్య చివరి మ్యాచ్ ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమే. గత దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారు. వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవు.
అభిమానులను అలరించడానికే ఇక్కడికి వచ్చాం. చివరి టెస్టులోనూ మంచి ఇన్నింగ్స్ ఆడటం మరింత సంతృప్తినిచ్చింది. టీ20లతో కెరీర్ను ప్రారంభించా. ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చా. నా విజయంలో కుటుంబం పాత్ర చాలా కీలకం. ప్రతి క్షణం వారితో పంచుకున్నా. కాండిస్ (వార్నర్ భార్య)కు థ్యాంక్యూ. కెరీర్లోచాలా మంది క్రికెటర్లతో కలిసి ఆడాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులను అలరించడానికి ప్రయత్నించా. నా ఆటతో ప్రతి ఒక్క అభిమాని ముఖంలో చిరునవ్వులు వచ్చేలా చేశానని భావిస్తున్నా. టెస్టు క్రికెట్ మున్ముందు మరింత ఉన్నతంగా మారాలని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని వార్నర్ వెల్లడించాడు.
డేవిడ్ వార్నర్ ఇప్పటికే వన్డేలకూ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్గా తన అవసరం ఉందనుకుంటే మాత్రం వస్తానని చిన్న మెలిక పెట్టాడు. వార్నర్ తన కెరీర్లో మొత్తం 112 టెస్టుల్లో 8,786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 37 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక 161 వన్డేల్లో 22 సెంచరీలతో 6,932 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు కెరీర్లో నాలుగు వికెట్లు కూడా పడగొట్టడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి