David Warner: రిటైర్మెంట్పై డేవిడ్ వార్నర్ యూ టర్న్.. ఆ టోర్నీలో మాత్రమే ఆడతాడట

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) రిటైర్మెంట్పై యూ టర్న్ తీసుకున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్తో టెస్టు మ్యాచ్ ఆడి సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. 2024 టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్తో వార్నర్ టీ20 కెరీర్కు ముగింపు పలికాడు. అయితే, తాజాగా వార్నర్ వన్డేల్లో రిటైర్మెంట్పై వెనక్కి తగ్గాడు. ఆసీస్ తరఫున మరోసారి ఆడాలని ఉందంటూ వార్నర్ సోమవారం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టాడు. అధ్యాయం ముగిసింది అంటూనే సెలక్టర్లు ఎంపిక చేస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
‘‘అధ్యాయం ముగిసింది!! సుదీర్ఘకాలం అత్యున్నత క్రికెట్ ఆడటం నాకు ఓ గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియా నా జట్టు. అంతర్జాతీయ స్థాయితోనే నా కెరీర్ ఎక్కువగా గడిచిపోయింది. ఇలా ఆడటం నాకు గర్వకారణం. అన్ని ఫార్మాట్లలో 100కుపైగా మ్యాచ్లు ఆడటం నా కెరీర్లోనే హైలైట్. ఈ జర్నీలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. మన అనుభూతి, అనుభవాలు ఇతరులకు తెలియవు. క్రికెట్ అభిమానులందరినీ అలరించానని అనుకుంటున్నాను. ముఖ్యంగా టెస్టుల్లో! నేను ఇతరుల కంటే వేగంగా ఆడుతూ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాను. ఇంకొన్నాళ్లు ఫ్రాంఛైజీ క్రికెట్లో కొనసాగుతాను. ఒకవేళ సెలక్టర్లు ఎంపిక చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరఫున ఆడటానికి సిద్ధంగా ఉన్నాను’’ అని డేవిడ్ వార్నర్ ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


