Rishabh Pant: సింగిల్ హ్యాండ్తో సిక్స్.. ఇలాంటి గేమ్ కోసమే ఏడాదిన్నర వేచి చూశా: పంత్
దిల్లీ అదిరిపోయే విజయంతో ఐపీఎల్ 17వ సీజన్లో ఖాతా తెరిచింది. రిషభ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తోపాటు బౌలర్లు రాణించడతో చెన్నైని ఓడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో దిల్లీ బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైను ఓడించింది. హాఫ్ సెంచరీతో (51) దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత మైదానంలోకి అడుగు పెట్టి అదరగొట్టాడు. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడంతో మునుపటి పంత్ను గుర్తుకు తెచ్చాడు. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘చెన్నైతో మ్యాచ్లో మా బౌలర్లు అద్భుతం చేశారు. గత మ్యాచుల్లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకుని బరిలోకి దిగాం. పృథ్వీ షా తీవ్రంగా శ్రమించాడు. అందుకే, అతడికి అవకాశం ఇచ్చాం. ముకేశ్ కుమార్ కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. పరిస్థితులను బట్టి అతడితో బౌలింగ్ వేయించాలని అనుకున్నాం. డెత్ ఓవర్లలో అద్భుతంగా బంతులు సంధించాడు. ఈ మ్యాచ్లో మేం పుంజుకున్న తీరు బాగుంది. నేను కూడా ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నా. చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడుతున్నా. తప్పకుండా నా నుంచి మంచి ఇన్నింగ్స్ వస్తుందని భావించా. ఒంటి చేత్తో సిక్స్ కొట్టడంపై స్పందించడానికేమీ ఉండదు. ఇలాంటి ఆట కోసం దాదాపు ఏడాదిన్నరపాటు వేచి చూశా. ఇప్పటికీ క్రికెటర్గా నేర్చుకుంటూనే ఉన్నా’’ అని పంత్ అన్నాడు. ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రిషభ్ పంత్కు రూ.12 లక్షలు జరిమానా పడింది.
నా బలమేంటో తెలుసు: ఖలీల్ అహ్మద్
‘‘బంతితో నేనేం చేయాలని అనుకున్నానో అదే చేసి చూపించా. దేశవాళీ క్రికెట్లో చాలా కష్టపడ్డా. గత ఆరు నెలల్లో చాలా మ్యాచులు ఆడా. ఇదే ఇప్పుడు నా ఆటతీరు మెరుగు పడేందుకు సాయం చేసింది. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు బౌలింగ్ వేయడం చాలా సరదాగా ఉంటుంది. బ్యాటర్లు ఇబ్బంది పడతారు. ఫిట్నెస్పైనా దృష్టిసారించా. రెడ్ బాల్ క్రికెట్ ఆడటం వల్ల చాలా విషయాలను నేర్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా మళ్లీ భారత జట్టులోకి అడుగు పెట్టడమే నా లక్ష్యం’’ అని ఖలీల్ అహ్మద్ తెలిపాడు. చెన్నైపై నాలుగు ఓవర్లు వేసిన ఖలీల్ 21 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అతడిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మా బౌలర్లు రాణించినా..: రుతురాజ్
‘‘మా బౌలింగ్ తీరు చూశాక కాస్త హ్యాపీగానే ఉన్నా. పవర్ ప్లేలో భారీగా పరుగులు ఇచ్చినా.. కుదురుకొని దిల్లీని చివరికి 191 పరుగులకే కట్టడి చేయగలిగాం. తొలి ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా అనిపించింది. ఆ తర్వాత బంతి అదనంగా సీమ్ కావడంతో ఎదుర్కోవడం కష్టమైంది. తొలి మూడు ఓవర్లలో మేం వికెట్లను కోల్పోవడంతోపాటు ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. ఇదే మా ఓటమికి కారణం. వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన తర్వాత ఇలాంటి ఫలితం ఎదురైంది. అయితే, మేం ఎలాంటి కంగారు పడటం లేదు. తప్పకుండా మున్ముందు మ్యాచుల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. దీపక్ చాహర్ భారీగా పరుగులు ఇచ్చాడు. పవర్ప్లేలోనే అతడు మూడు ఓవర్లు వేస్తాడు. అప్పుడప్పుడు బ్యాటర్లు ఎదురు దాడి చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి తప్పదు. కానీ, దీపక్ అద్భుతమైన బౌలర్ అనడంలో సందేహమే లేదు’’ అని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?