Dhruv Jurel: అర్ధశతకం తర్వాత ధ్రువ్ అలా ఎందుకు చేశాడంటే..!
ఇంగ్లాండ్పై నాలుగో టెస్ట్లో మెరిసిన ధ్రువ్.. అర్ధశతకం పూర్తయ్యాక సెల్యూట్ చేసి అందరినీ ఆకట్టుకొన్నాడు. దీనికో కారణం ఉంది.
ఇంటర్నెట్డెస్క్: రాజ్కోట్ 90 పరుగులతో టీమ్ ఇండియాను ఆదుకొన్న ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అర్ధశతకం సంబరాలు మాత్రం తొలుత అభిమానులకు అర్థం కాలేదు. అతడు అలా ఎందుకు చేశాడో తెలిశాక మాత్రం నెటిజన్లు ‘నీకు హ్యాట్సాఫ్’ అంటున్నారు. నేడు 30 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ కుర్రాడు మెల్లగా గేర్లు మారుస్తూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. టెయిలెండర్లతో కలిసి ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని కేవలం 46 పరుగులకు కుదించేశాడు.
నేడు తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకొన్నాక ధ్రువ్ ‘సెల్యూట్’ చేయడం అందర్ని ఆశ్చర్యపర్చింది. మాజీ సైనికుడైన తన తండ్రి గౌరవార్థం అతడు అలా చేశాడు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అతడి తండ్రి నేమ్ చంద్ జురెల్ దేశానికి సేవలు అందించారు. హవాల్దార్ హోదాలో ఆయన సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. ధ్రువ్ను కూడా ఆయన ఓ సైనికాధికారిగా చూడాలనుకున్నారు. కానీ, చిన్నతనం నుంచి క్రికెట్పై మక్కువ ఉండటంతో ఆ దిశగా ప్రోత్సహించారు.
‘మరో ధోనీ కనిపిస్తున్నాడు’.. ధ్రువ్ జురెల్పై గావస్కర్ ప్రశంసలు
ఇటీవల టెస్ట్ క్యాప్ అందుకొంటున్న సమయంలో ఆ క్షణాలను తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు ధ్రువ్ ప్రకటించాడు. ‘‘ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడితే.. నాన్నను సంప్రదిస్తాను. సరైన మార్గదర్శకత్వం చేస్తారు’’ అని నాడు వెల్లడించాడు. 2020లో అండర్-19 ప్రపంచకప్ వైస్కెప్ట్న్గా ధ్రువ్ బాధ్యతలు నిర్వర్తించాడు. 2022లో తొలిసారి లీగ్ క్రికెట్లో రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహించాడు.
రింకూ సింగ్ అభినందనలు..
ధ్రువ్ ఇన్నింగ్స్ను పలువురు ఆటగాళ్లు అభినందిస్తున్నారు. టీమ్ ఇండియా హిట్టర్ రింకూ సింగ్ కూడా ఆ జాబితాలో చేరాడు. తన ఇన్స్టాలో ఓ సందేశం ఉంచాడు. ‘‘నా సోదరా.. కలలను సాకారం చేసుకొనే సమయం ఆసన్నమైంది’’ అని ఇద్దరూ కలిసున్న ఫొటోను పోస్టు చేశాడు. రింకూతో తనకు మంచి అనుబంధం ఉందని ఇటీవల ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువ్ వెల్లడించాడు. అతడు తన రూమ్మేట్ అని పేర్కొన్నాడు. గుజరాత్పై గత ఐపీఎల్లో వరుసగా ఐదు సిక్స్లు కొట్టిన రింకూ ఆ తర్వాత తనకు ఫోన్ చేసి.. ‘‘ఎలా ఉంది.. చెప్పు ఎలా ఉంది’’ అని అడిగాడని గుర్తు చేసుకొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత