Dhruv Jurel: ‘మరో ధోనీ కనిపిస్తున్నాడు’.. ధ్రువ్ జురెల్పై గావస్కర్ ప్రశంసలు
Dhruv Jurel: భారత్, ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతున్న నాలుగో టెస్ట్లో వికెట్కీపర్ ధ్రువ్ జురెల్ 90 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో అతనిపై సునీల్ గావస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
రాంచీ: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వికెట్కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) 90 పరుగులు చేశాడు. టీమ్ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనిపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసల వర్షం కురిపించాడు. లెజెండరీ క్రికెటర్ ధోనీతో పోల్చాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు.
‘‘ధ్రువ్ జురెల్ ఏకాగ్రత చూస్తుంటే నాకు మరో ఎం.ఎస్.ధోనీ తయారవుతున్నాడనిపిస్తోంది. ఈరోజు అతడికి శతకం చేజారి ఉండొచ్చు. కానీ, ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడు’’ అని కామెంటరీలో భాగంగా గావస్కర్ విశ్లేషించాడు. నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి ధ్రువ్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మూడో రోజు కుల్దీప్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన అతడు మరో 60 పరుగులు జోడించాడు.
మధ్యాహ్న భోజన విరామానికి ముందు టామ్ హార్ట్లీ వేసిన బంతికి ధ్రువ్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 149 బంతుల్లో రెండు సిక్సులు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు సాధించాడు. దీంతో కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకునే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఎనిమిదో వికెట్కు కుల్దీప్, జురెల్ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. కుల్దీప్ మరోసారి 131 బంతుల్లో రెండు ఫోర్లతో కలిపి 28 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
మొత్తానికి నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 307 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ 90, యశస్వి జైస్వాల్ 73, శుభ్మన్ గిల్ 38, కుల్దీప్ యాదవ్ 28 మాత్రమే రాణించారు. ఇంగ్లాండ్ జట్టులో యువ బౌలర్ బషీర్ ఐదు వికెట్లతో విజృంభించాడు. హార్ట్లీ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్కు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.