Hardik Pandya: హార్దిక్ను అహ్మదాబాద్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?: భారత మాజీ క్రికెటర్
అహ్మదాబాద్లో ముంబయి కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడే సమయంలో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ను (Gujarat Titans) తొలిసారే ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపాడు. వరుసగా రెండోసారి ఫైనల్కు చేర్చిన ఘనత కెప్టెన్ హార్దిక్ పాండ్య. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. మరో రెండు రోజులకే (మార్చి 24న) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ X ముంబయి మధ్య జరగనుంది. గుజరాత్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్య అహ్మదాబాద్లో మ్యాచ్ ఆడే సమయంలో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు.
‘‘ హార్దిక్ పాండ్య తన సొంతమైదానంలో ముంబయి కెప్టెన్గా ఎలా ఆడతాడో చూడాలి. ఆ సమయంలో అభిమానులు అతడిని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆసక్తికరంగా ఉంది. ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించాలి. ఐపీఎల్ తొలి సీజన్లో ముంబయి-కోల్కతా మధ్య మ్యాచ్ సందర్భంగానూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మా జట్టు (కోల్కతా) తరఫున బరిలోకి దిగాడు. అతడిని బౌండరీ లైన్ వద్ద ఉంచాం. దీంతో ముంబయి అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అతడిని సర్కిల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే ఆ నినాదాలు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు హార్దిక్ ముంబయి తరఫున అహ్మదాబాద్ మైదానంలో ఆడబోతున్నాడు. అతడు ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్, బౌలింగ్ సమయాల్లో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అరుపులతో హోరెత్తించాలని కోరుకుంటున్నా. ఒకవేళ అలా చేయకపోతే ఐపీఎల్లో మజా ఏముంటుంది? కానీ, అది కూడా సహేతుకంగా ఉంటేనే బెటర్’’ అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి