Hardik Pandya: హార్దిక్ను అహ్మదాబాద్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి?: భారత మాజీ క్రికెటర్
అహ్మదాబాద్లో ముంబయి కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడే సమయంలో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ను (Gujarat Titans) తొలిసారే ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపాడు. వరుసగా రెండోసారి ఫైనల్కు చేర్చిన ఘనత కెప్టెన్ హార్దిక్ పాండ్య. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. మరో రెండు రోజులకే (మార్చి 24న) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ X ముంబయి మధ్య జరగనుంది. గుజరాత్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్య అహ్మదాబాద్లో మ్యాచ్ ఆడే సమయంలో అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు.
‘‘ హార్దిక్ పాండ్య తన సొంతమైదానంలో ముంబయి కెప్టెన్గా ఎలా ఆడతాడో చూడాలి. ఆ సమయంలో అభిమానులు అతడిని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆసక్తికరంగా ఉంది. ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించాలి. ఐపీఎల్ తొలి సీజన్లో ముంబయి-కోల్కతా మధ్య మ్యాచ్ సందర్భంగానూ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మా జట్టు (కోల్కతా) తరఫున బరిలోకి దిగాడు. అతడిని బౌండరీ లైన్ వద్ద ఉంచాం. దీంతో ముంబయి అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అతడిని సర్కిల్లోకి తీసుకొచ్చాం. ఎందుకంటే ఆ నినాదాలు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు హార్దిక్ ముంబయి తరఫున అహ్మదాబాద్ మైదానంలో ఆడబోతున్నాడు. అతడు ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్, బౌలింగ్ సమయాల్లో అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అరుపులతో హోరెత్తించాలని కోరుకుంటున్నా. ఒకవేళ అలా చేయకపోతే ఐపీఎల్లో మజా ఏముంటుంది? కానీ, అది కూడా సహేతుకంగా ఉంటేనే బెటర్’’ అని చోప్రా అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.